Andhra Pradesh ఏపీలో కుర్రాళ్లు ప్రేమ పిపాసులు.., కాస్త మధ్య వయసు వచ్చాక కుల పిపాసులు.., లేటు వయసులో రాజకీయ పిపాసులు.., ఏ వయసులో అయినా సినిమా పిపాసులు ఎక్కువ..! అటువంటి రాష్ట్రంలో మత పిపాసని, మత పిచ్చిని, మత పైత్యాన్ని రగిల్చి.. అగ్గి వెలిగించి తాము చలి కాచుకోవాలి అనేది బీజేపీ వ్యూహం. మతం ఉంటేనే బీజేపీ ఉంటుంది. మతం కాంక్ష ఉంటేనే బీజేపీకి నాలుగు ఓట్లు పడతాయి, మత ఆలోచన ఉంటేనే BJP ఉనికి ఉంటుంది..!
అందుకే Andhra Pradesh BJP ఏపీలో ఇన్నాళ్లు బీజేపీకి అంత సీన్ లేదు. అటువంటి బీజేపీ ఇప్పుడిప్పుడే ఏపీలో ట్రాక్ ఎక్కుతుంది. ఆ పార్టీకి కావాల్సిన మేత ఫుల్ గా దొరుకుతుంది. ఉనికిని చాటాల్సిన సందర్భాలు వచ్చి పడుతున్నాయ్. అందుకే ఆ నేతలు జీవీఎల్, సునీల్ ధియోధర్, బండి సంజయ్ వరుసగా అదే టాపిక్ పై ప్రెస్ మీట్లు పెడుతున్నారు..! అసలు AP BJP బీజేపీ ట్రాక్ ఏంటి..? వారి వ్యూహం ఎలా అమలు చేయనున్నారు అనేది లోతుగా చూస్తే..!!
బీజేపీ అసలు తత్వం ఇదే..!!
బీజేపీ అనేది పచ్చిగా ఒక మత, హిందూ పార్టీ. ఎవరూ కాదనలేరు. 1989 లో కేవలం రెండే ఎంపీ స్థానాలు ఉన్నా ఆ పార్టీ.. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత రామజన్మభూమి.. అయోధ్య రామమందిరం సెంటిమెంట్ తో ఉత్తర భారతానా బాగా ఎదిగింది. 1989 లో కేవలం రెండే స్థానాలు ఉండగా.. 1994 నాటికి 80 స్థానాలకు ఎదిగింది. దీనిలోనూ యూపీ, బీహార్ లాంటి రాష్ట్రాల్లోనే అధిక సీట్లు. అలా అలా దేశం మొత్తం పాకేసింది. మతాన్ని, మత అస్త్రాన్ని విస్తరించింది. అక్కడ ఏ గుడి, ఏ హిందూ విగ్రహం, ఏ వివాదం ఉన్నా వాలిపోయి సెంటిమెంట్ అస్త్రంతో రాజకీయాలు చేస్తూ దగ్గరయింది. ఇదే తరహాలో తెలంగాణాలో కూడా బాగానే ఎదిగింది. ఇక ఏపీలో సమయం వచ్చేసింది. ఏపీ ఒక్కటే బీజేపీకి ఇప్పటి వరకు లొంగని రాష్ట్రంగా ఉంది. ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తే ఒక్క సీటు కూడా జీవన రాష్ట్రం ఏపీ ఒక్కటే. ఇక్కడ కమలం అంటేనే ఓటర్లు తిప్పి కొడతారు. ఇటువంటి రాష్ట్రంలో కూడా ఇప్పుడు బీజేపీ తమకే సాధ్యమైన అసలు గేమ్ మొదలు పెట్టింది..!
గ్రేటర్ లో ప్లాన్ సేమ్ తిరుపతిలో కూడా..!!
గ్రేటర్ లో ఏం జరిగింది..? ఎంఐఎం హిందువులను తిట్టడం.. బీజేపీ వెళ్లి హిందువులను దువ్వడం..! అంటే సింపుల్ గేమ్ ఆడారు. గెలిచారు. ఏవైనా దెబ్బలు తగిలినప్పుడే కదా నర్సులు, డాక్టర్లు విలువ తెలుస్తుంది..? సో.., గ్రేటర్ లో ఎంఐఎం ద్వారా హిందువులకు దెబ్బ తగిలించి.. బీజేపీ వెళ్లి దువ్వడం ద్వారా బాగానే ఎదిగారు. నిజానికి గ్రేటర్ లో ఇటువంటి స్ట్రాటజీ లేకపోతే బీజేపీకి పది స్థానాలు వరకు మాత్రమే దక్కేవి. అసలు ఆ పార్టీకి ఎన్నికల ప్రచార రాష్ట్రం, కీలక ఆయుధం దొరికేది కాదు. అటువంటి దశలో తాము సులువుగా అల్లుకుపోయి రాజకీయం చేయగలిగిన మత రాష్ట్రాన్ని ఎంఐఎం ద్వారా అక్కడ రగిల్చి బీజేపీ గ్రేటర్ లో పాతుకుపోయింది. అక్కడ టీఆరెస్ పాపాలు, ఎంఐఎం ఇచ్చిన సహకారం, కాంగ్రెస్ నిద్రావస్థ కూడా బీజేపీకి బాగా కలిసొచ్చాయి. సో.., అక్కడి హిందూ రాజకీయం తరహాలోనే..!
ఏపీలో సేమ్ గేమ్..! బండి, జీవీఎల్, సునీల్ ద్వారా..!!
ఏపీలో కూడా ఇప్పుడు హిందువులకు దెబ్బలు తగులుతున్నాయి. సో.., ఇక్కడ వారికి మందు రాసె బాధ్యత మాత్రం బీజేపీ తీసుకుంది. తెలంగాణాలో అంటే హిందువులను ఎంఐఎం మానసిక దెబ్బ కొట్టింది. ఇక్కడ ఏపీలో ఎవరు కొడుతున్నారు అంటే..? ఆ మ్యాటర్ కొంచెం కీలకం సున్నితం.. నెమ్మదిగా చెప్పుకుందాం..! కానీ ఎలాగోలా బీజేపీకి డాక్టర్ పాత్ర, నర్సు పాత్ర మాత్రం వచ్చేసింది. హిందువుల మనసులలోకి దూరిపోయి.., మెదడులోకి దూరిపోయి నరనరాన హిందూ పిచ్చి, పైత్యాన్ని రగిల్చేయాలి. ఆ పాత్రని మూడు వారలు కిందట జీవీల్ పోషించారు. “ఏపీలో సర్జికల్ స్ట్రైక్స్ జరగాలి” అన్నారు. జనం పెద్దగా పట్టించుకోలేదు. ఈరోజు బండి సంజయ్ వచ్చి.. “బైబెల్ పార్టీ కావాలో.., భగవద్గీత పార్టీ కావాలో” తేల్చుకోమన్నారు..! సో.., ఇప్పటికే అర్ధమైందిగా ఏపీలో బీజేపీ గేమ్ ఏంటో..? ట్రాక్ ఏంటో..!? అది విజయవంతమై నాలుగు ఓట్లు పడకపోతాయా..? తిరుపతిలో గెలవకపోతామా అనేది బీజేపీ గేమ్..! ఇక్కడ ఇది అమలు జరిగితే.., విజయవంతమైతే ఇబీజేపీ స్ట్రాటజీ ఒకలా ఉంటుంది. ఒకవేళ బెడిసికొడితే మాత్రం వ్యూహం మారుతుంది..!!