మానవుడు నాగరికత పేరుతో ధనం వెనుక అభివృద్ధి అనే ఇంధనం వేసుకొని పరుగులు పెడుతున్న తీరు ఇప్పుడు అనేక రోగాలకు కారణం అవుతోంది. ఇక ప్రపంచంలో చాలామందికి గ్యాస్ ప్రాబ్లం చాలా సర్వసాధారణమైన విషయం. మన పూర్వీకులలో అసలు ఇటువంటి సమస్య అనేది తలెత్తకపోగా మనలో మాత్రం 30 ఏళ్లు దాటిన వెంటనే ప్రతి 10 మందిలో కనీసం ఐదుగురికి ఈ సమస్య ఉంటోంది. వేళకు తిండి తినకపోవడం వల్ల ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. దీని నివారణ కోసం యాంటాసిడ్ ట్యాబ్లెట్ లు వాడుతూ ఉంటారు
అయితే ఇప్పుడు ఈ యాంటాసిడ్ ఫెమోటిడైన్ కరోనా చికిత్సకు ఉపయోగపడుతూ ఉండడం గమనార్హం. ఫెమోటిడైన్ అనే పేరు గల యాంటాసిడ్ కరోనా రోగుల పై చాలా మంచి ప్రభావం చూపిస్తుందట. కరోనా వ్యాధిని నయం చేసేందుకు అవసరమయ్యే వ్యాక్సిన్ వచ్చేందుకు మార్కెట్ లోనికి వచ్చేందుకు ఇంకా ఆరేడు నెలలు పట్టేలా ఉంది. అప్పటి వరకూ హైడ్రోక్లోరోక్విన్ మరియు హెచ్ఐవి వ్యాధి నయం చేసేందుకు కావలసిన మందులు మాత్రమే చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు.
కానీ చైనాలోని వుహాన్ లో ఉన్న కరోనా రోగులకు యాంటాసిడ్ ఫెమోటిడైన్ ఇవ్వగా సత్ఫలితాలు వచ్చాయంటూ అంతర్జాతీయ జర్నల్ సైన్స్ మ్యాగ్ ఒక రిపోర్టు ఇచ్చింది. దీంతో న్యూ యార్క్ లోని నార్త్ వెల్ ఆస్పత్రిలో కూడా దీనికి సంబంధించిన ప్రయోగాలు అప్పుడే మొదలయ్యాయి. ఇక విశేషం ఏమిటంటే ఈ యాంటాసిడ్ ఫెమోటిడైన్ టాబ్లెట్ ధర కేవలం 30 నుండి 40 పైసలే కావడమే కాదు మన దేశంలో దొరికే అతి చవకైన ఔషధాల్లో ఇది కూడా ఒకటి.
మొన్నటి వరకూ హైడ్రోక్లోరోక్విన్ మందు కోసం ప్రపంచమంతా అన్వేషించింది. భారత్ కూడా అనేక దేశాలకు ఈ మాత్రలు పంపింది. ఇప్పుడు ఈ యాంటాసిడ్ ఫెమోటీడైన్ కోసం అన్ని దేశాలు ఆరా తీస్తున్నాయట. భారత్ కూడా హుటాహుటిన ఈ మందు నిల్వల గురించి వాకబు చేసిందట. దేశంలో తగినన్ని నిల్వలు ఉంచాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిందట. అయితే దీనిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందంటోంది అని చెబుతోండి సైన్స్ మ్యాగ్.