5 తరగతి వరకు మాతృభాషలోనే…
జగన్ సర్కారుకు సంకటమా…
దేశంలో కొత్త విద్యా వ్యవస్థను నిర్ణయిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఏపీలో ఎలా అమలవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఏపీలో జగన్ సర్కారు
1నుంచి 6వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పని సరి చేస్తూ నిర్ణయం తీసుకొంది. అయితే ఇప్పుడు కేంద్రం కొత్త నిబంధన ఆ ప్రతిపాదనకు ఎలాంటి సవరణలు తీసుకొస్తుందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయ్. ఇప్పటికే ఆంగ్ల మీడియం కావాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది. న్యాయస్థానాల నుంచి ఆంగ్ల మీడియంపై కొన్ని ప్రశ్నలు తలతెత్తాయ్.
తాజాగా… మాతృభాషలోనే విద్యను ఐదో తరగతి వరకు బోధించాలంటూ కేంద్రం కొత్త నిర్ణయం తీసుకొంది. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న విద్యా వ్యవస్థను ఇప్పుడు కేంద్రం ప్రక్షాళన చేసింది. స్థానిక భాష లేదంటే… మాతృభాష ఐదో తరగతి వరకు బోధించాల్సిందేనంటూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ స్పష్టం చేసింది. 8వ తరగతి వరకు అదే విధానం కొనసాగింపు చాలా మంచిదంటూ తేల్చింది. సంస్కృతంతోపాటు, విదేశీ భాషలు సైతం ప్రాధమిక స్థాయిలో ఏర్పాటు చేయాలంది. అదే సమయంలో పలనా భాషను ఎవరిపైనా రుద్ధాల్సిన అవసరం లేదంది. హిందీని
దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తింపజేయాలంటూ గత జూన్లో తీసుకున్న నిర్ణయానికి దక్షిణాదిలో పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురైంది.
ప్రస్తుతమున్న 10+2 బదులుగా… 5+3+3+4 విధానానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అంగన్ వాడీ లేదంటే ప్రీ స్కూల్ మూడేళ్లపాటు కామన్ గా ఉంటుంది. 11 నుంచి 14 ఏళ్ల ప్రైమరీ విద్యా వ్యవస్థ, 11 నుంచి 14 ఏళ్ల వరకు ప్రాధమిక విద్యగా మారనుంది. ఏటా పరీక్షలకు బదులుగా 3, 5, 8 తరగతుల్లో పరీక్షల నిర్వహణ అధారంగా తర్వాత తరగతుల్లోకి పంపిస్తారు. టెన్త్, ఇంటర్ చదివే వారికి బోర్డ్ పరీక్షలు ఇప్పటి వరకు యాధావిధిగా సాగుతాయ్. ఇకపై నాలుగేళ్ల డిగ్రీని కేంద్రం ప్రతిపాదించింది. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన కేంద్రం దేశంలోని నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఫర్ రెగ్యులేషన్, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, నేషనల్ ఎక్రిడేషన్ కౌన్సిల్ మొత్తం విద్యావ్యవస్థను నిర్దేశించనున్నాయ్.