ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది అన్న విషయం ముమ్మాటికీ వాస్తవం. చంద్రబాబు తర్వాత పార్టీని ముందుండి నడిపించేది ఎవరు అన్న ప్రశ్నకు పెద్దలు అంతా తెల్ల ముఖాలు వేసుకుని చూస్తున్నారు. అయితే ఇటువంటి సమయంలో టిడిపిలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా యువ నాయకత్వానికి పెద్దపీట వేయనుందన్న వార్తలు జోరందుకున్నాయి. టిడిపి సీనియర్లు సైతం యువతను ప్రోత్సహించి సరైన మార్గదర్శకత్వం చేస్తేనే పార్టీ భవిష్యత్తు బాగుంటుందని భావిస్తున్నారు.
అయితే గత ఏడాదే టిడిపి ఎన్నికల్లో యువతకు బాగానే ప్రాధాన్యతనిచ్చారు. అనంతపురం ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో యువతరం టిక్కెట్లు చేజిక్కించుకుంది. వీరంతా 35 ఏళ్ల లోపు వారు కావడం గమనార్హం. అయితే అందరూ ఏదో ఒక రకంగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చి టికెట్ దక్కించుకున్న వారు తప్ప జెండాలు మోసిన వారు ఎవరు పదవులు చేజిక్కించుకోలేదు. దీంతో చాలా నియోజకవర్గాల్లో ఎలాంటి రాజకీయ వారసత్వం లేని యువతకు ఈ పార్టీలో భవిష్యత్తు లేదు అన్న వ్యాఖ్యలు వచ్చాయి. దానికి తగ్గట్టు జగన్ సునామీ పెద్ద ఎత్తున టిడిపి పై ప్రభావం చూపింది. ఇక చంద్రబాబు తన కొడుకు లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించాలని చేసిన ప్రయత్నాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
కానీ ఇప్పుడు కొద్దిగా గ్యాప్ తీసుకొని ఒకేసారి లోకేష్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. తాను ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే పార్టీని తన కుమారుడికి అప్పగించాలన్నది బాబు వ్యూహం. నిజానికి గత ఎన్నికల్లో టిడిపి గెలిచినా లేదా గట్టి పోటీ ఇచ్చినా కూడా ఇప్పటికే లోకేష్ కు పట్టాభిషేకం అయిపోయి ఉండేది అనే టాక్ ఉంది. కానీ అనూహ్యంగా ఎదురైనా అవమానకర పరాజయంతో బాబు పూర్తి మౌనం వహించాడు
ఇకపోతే టిడిపిలో నందమూరి కుటుంబం ప్రాధాన్యత రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎన్టీఆర్ తర్వాత వారసులను చంద్రబాబు ఎలా సైడ్ చేశారో అందరూ చూశారు. హరికృష్ణ కెరీర్ కూడా ఎలా ముగిసిందో తెలిసిందే. కాబట్టి ఇక చిన్న బాబు లోకేష్ పైన పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించేందుకు చంద్రబాబుకి కావలసినంత సమయం ఉంది. అతనికి అంటూ ఒక సమర్థవంతమైన టీమ్ ను తయారు చేసి జనాల్లోకి పంపి తగిన మైలేజ్ మరియు ఇమేజ్ సంపాదించిపెట్టడమే బాబు నరిఉ చిన్నబాబు తదుపరి లక్ష్యం.