తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదట్లో కరోనా నివారణ చర్యల్లో సరిగ్గా దృష్టి పెట్టలేదని ఎన్నో విమర్శలు ఎదురుకున్నారు. అయితే ఆ తర్వాత మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ కేసుల సంఖ్య తక్కువగానే ఉండడం మనం గమనించవచ్చు,. ఇరుగు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు నమోదు అవుతుంటే…. తెలంగాణలో మాత్రం కొంచెం కంట్రోల్ లో ఉన్నట్లు అనిపించాయి. అయితే గడిచిన మూడు రోజులుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది అసలు ఏం జరిగింది?
ఈ రెండు రోజుల్లోనే
తెలంగాణ రాష్ట్రం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది అనుకుంటున్న సమయంలో గత మూడు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు ఇబ్బందిగా మారుతున్నాయి. వరుసగా రెండు రోజులు తెలంగాణలో పాజిటివ్ కేసు సంఖ్య అంతకంతకూపెరిగి పోయింది. ఈ రోజు విడుదల చేసిన బులిటెన్ చూస్తే కేసుల సంఖ్య 2384 కు చేరడం ఆందోళన కలిగించే విషయమే. అయితే ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే కేసుల సంఖ్య తక్కువే అయినా కూడా ఒక్కసారిగా పెరిగిన రేట్ మాత్రం చాలా ఎక్కువ
అంతా దాని వల్లనేనా?
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం వీధుల్లో పెద్ద ఎత్తున రద్దీ నెలకొంది. ఒక విధంగా చెప్పాలంటే లాక్ డౌన్ తర్వాత వీధులు రద్దీగా పూర్తిగా జనంతో నిండిపోవడం ఇప్పుడే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే పది రోజుల్లో వినాయకచవితి ఎఫెక్ట్ తో తెలంగాణలో కరోనా కొత్త పుంతలు తొక్కుతుంది. ఇక దీనికి ముందే కేసులు భారీగా పెరిగినా… ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మరో పది రోజులు తెలంగాణ ప్రజలంతా ఊపిరిబిగబట్టి బ్రతకాల్సిన పరిస్థితి. అందరికీ ఇప్పుడు ఇది కొత్త టెన్షన్ తెస్తోంది.
ఇది కొంచెం మేలు
అయితే ఇక్కడ కొంచెం ఆనందకరమైన విషయం ఏమిటంటే… మరణాల సంఖ్యలో మాత్రం పెద్దగా మార్పు లేదు. గడచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది మరణించినట్లుగా నివేదికలో పేర్కొన్నారు. అదే సమయంలో రికవరీ అయినవారు 1851. ఎప్పటిలానే కేసులు భారీగా గ్రేటర్ హైదరాబాద్లోనే అత్యధికంగా నమోదయ్యాయి. ఇటీవల నమోదైన కేసులు తో పోలిస్తే ప్రతీచోట కాస్త ఎక్కువగానే కేసులు నమోదు కావడం జరిగింది.
జీహెచ్ఎంసీలో 472 పాజిటివ్ లు తేలితే.. రెండో స్థానంలో నిజామాబాద్ (148).. మూడో స్థానంలో నల్గొండ (137).. నాలుగో స్థానంలో రంగారెడ్డి (131).. ఐదో స్థానంలో కరీంనగర్ (120) నిలిచాయి. వందకు పైగా నమోదైన జిల్లాల విషయానికి వస్తే.. సూర్యాపేట (110).. ఖమ్మం (105).. జగిత్యాల (105) నమోదయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ కేసులు నమోదు కాగా.. అతి తక్కువ కేసులున్న జిల్లాగా జయశంకర్ భూపాలపల్లి నిలిచింది. ఈ జిల్లాలో కేవలం ఏడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. తక్కువగా కేసులు నమోదైన జిల్లాల్లో కొమరంభీం ఆసిఫాబాద్ (12).. నారాయణపేట (13).. నిర్మల్ (19).. వికారాబాద్ (19).. ములుగు (19).. అదిలాబాద్ (25).. కేసులు నమోదయ్యాయి.