Covid-19 : కోవిడ్-19 Covid-19 గతేడాది భారత్ ను బంధించి వదిలేస్తే.. ఈ ఏడాది కమ్మేస్తోంది. అత్యంత వేగంగా వ్యాపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. గతేడాది వ్యవస్థలు కూప్పకూలాయి. ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పింది. ప్రజలు ఉపాధి, ఆర్ధిక పరిస్థితి మీద దెబ్బ కొట్టింది. ఇప్పుడు మళ్లీ ఆ దిశగానే వెళ్తోంది. అయితే.. ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులో ఉండటం కాస్త ఉపశమనం ఇచ్చే విషయం. అయినా.. రోజురోజుకీ పెరుగుతున్న కేసులు అభయం ఇవ్వడం కంటే.. భయాన్నే ఇస్తున్నాయి. గత వారంలో రోజులుగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవడమే ఇందుకు నిదర్శనం.
గత వారంతో పోలిస్తే గతవారం కొత్తగా నమోదైన కరోనా కేసుల శాతం 70 శాతం అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏప్రిల్ 5 నుంచి 11 (వారంలో రోజుల్లో) దేశంలో 9,38,650 కొత్త కేసులు నమోదవడం తీవ్రంగా కలవరపెట్టే విషయం. ఏప్రిల్ 5కి దేశంలో 7లక్షల కేసులు ఉంటే.. వారంలో నాలుగున్నర లక్షలు పెరిగిపోయాయి. దేశంలో 10 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. రాష్ట్రాల్లో మహారాష్ట్రలో తీవ్రత ఎక్కువగా ఉంది. ఒక్కరోజులోనే అక్కడ 62వేల కేసులు నమోదయ్యాయి. తర్వాత.. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, చత్తీస్ గడ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ ఉన్నాయి. మరణాల రేటు కూడా పెరిగిపోతోంది. 24 గంటల్లో 903 మంది మృతి చెందారు. వారం క్రితంతో పోలిస్తే ఇది 70 శాతం పెరుగుదల. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే అత్యధిక రోజువారీ మరణాల రేటు.
కరోనా కేసుల్లో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు బ్రెజిల్ ను దాటి రెండో స్థానంలోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 6.32 లక్షల కరోనా కేసులు నమోదైతే భారత్ లో 1,68,912 గా ఉంది. మొత్తంగా అమెరికాలో 3.19 కోట్ల మందికి కరోనా సోకితే.. రెండో స్థానంలో ఉన్న భారత్ లో 1.35 కోట్ల మంది.. బ్రెజిల్ లో 1.34 కోట్ల మందికి వైరస్ సోకింది. భారత్ రెండు వ్యాక్సిన్లు తీసుకొచ్చిన దేశంగా గర్వించాలో.. రెండో స్థానంలో నిలిచినందుకు బాధ పడాలో అర్ధంకాని పరిస్థితి ఇది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?