Telangana : తెలంగాణ Telangana దేశంలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ఒక్కటే దేశాన్ని వణికించేస్తోంది. రోజుకు 25వేల వరకూ కేసులు నమోదవుతున్నాయి. కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువగానే ఉంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రతో ఎక్కువగా సరిహద్దు ఉన్న తెలంగాణలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే ప్రమాదకరంగా మారుతున్నాయి.
కరీంగన్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, అదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కోరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్ధులకు కరోనా ఎక్కువగా ఎఫెక్ట్ కావడం కలవరం పెడుతోంది. నిన్న ఒక్కరోజే జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 32 మంది బాలికలకు 5గురు ఉపాధ్యాయులకు కరోనా సోకడం తీవ్ర కలకలం రేపుతోంది.
మరోపక్క హైదరాబాద్ లో కూడా కరోనా ఆందోళన కలిగిస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చేవారి సంఖ్య నగరంలో ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు కరోనా బారిన పడ్డారో కూడా తెలియని పిరిస్థితి నెలకొంది. రాష్ట్రానికి మహారాష్ట్ర నుంచి దాదాపు 50వేల మంది వరకూ వచ్చుంటారని ఒక అంచనా. వీరంతా మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించిన తర్వాత తెలంగాణకు వచ్చినవారే కానీ..
పనుల నిమిత్తం వచ్చిన వారు కాదని తెలుస్తోంది. పైగా.. వీరెవరికీ కూడా కరోనా టెస్టులు చేయకబపోవడంతో కొంత ఆందోళన కలిగిస్తోంది. గతంలో మాదిరిగా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు, టెస్టులు వంటి ప్రక్రియ ఇంకా పూర్తిస్థాయిలో చేపట్టలేదు. దీంతో పరిస్థితులు కఠినంగా మారకముందే రాష్ట్రానికి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం త్వరగా అలెర్ట్ కావాలనే వాదనలు వస్తున్నాయి.
తెలంగాణలో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కరోనా టెస్టులు సరిగా చేయలేదని అనేకసార్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చిరించిన సందర్భాలూ ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా మరింత తీవ్రం అయ్యాక మాత్రమే కరోనా టెస్టుల్లో వేగం పెంచింది ప్రభుత్వం. దీంతో కొంత పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. గతంలా కాకుండా రాష్ట్రంలో కరోనా తీవ్రంగా లేకపోవడం వల్ల ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నారులు వైరస్ బారిన పడటంతో ప్రభుత్వం మేల్కొంది. అయితే.. పరిస్థితులు మరింత తీవ్రం కాకముందే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం అని చెప్పాలి..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?