Corona Virus : 2020 సంవత్సరం మొత్తం మానవాళి కరోనా మహమ్మారి తోనే గడిపింది. ఇక వ్యాక్సిన్ వచ్చి నెల రోజులు అవుతుంది కానీ ఇది పూర్తిగా అంతమైపోతుంది అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా కరోనా వీరవిహారం చేస్తూనే ఉంది. ఆ దేశం… ఈ దేశం తిరిగి చివరికి భారత్ లో మళ్ళీ పుంజుకుంది ఈ ప్రాణాంతక వైరస్. సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
కొత్త స్ట్రైన్ లే అసలు ప్రాబ్లం….
రోజురోజుకీ మ్యుటేషన్ చెందుతూ కొత్త కొత్త వేరియంట్లలో కోవిడ్ వైరస్ స్ట్రైన్ లు పుట్టుకొస్తున్నాయి. ఇక ఈ మహమ్మారిని నిలువరించేందుకు సైంటిస్టులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వ్యాక్సిన్లు బాగానే ఉన్నప్పటికీ ఇంకా వీటిపై సమర్థవంతంగా పోరాడే ఫార్ములాలు కనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. అయితే డిసెంబర్ 2021 నాటికి అందరి జీవితాలు మళ్ళీ సాధారణ స్థితికి రావచ్చు అని అంటున్నారు.
హెర్డ్ ఇమ్యూనిటీ నే దిక్కు
ఇప్పుడు భారతదేశంలో కూడా సెకండ్ వేవ్ మొదలైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో ప్రతిరోజు కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అసలు దీనికి అంతం ఉందా అన్న అనుమానాలు ఎక్కువయ్యాయి. అయితే ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ ద్వారా కరోనా మహమ్మారి ని అంతం చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కోసం ప్రపంచ జనాభాలో 70% నుండి 80% మంది కోవిడ్ నుండి ఇమ్యూనిటీ సాధించాలి. కాబట్టి అంత శాతం ఇమ్యూనిటీ సాధించాలంటే అందరూ తగిన స్థాయిలో టీకాలు వేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రస్తుతానికి….
ఈ ఏడాది ఫిబ్రవరి 22 నాటికి 44.1 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ జరిగింది. వీరిలో 19.4 మిలియన్ల మందికి రెండు మోతాదుల లో పూర్తిగా టీకాలు వేశారు. హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాలంటే సుమారు 300 మిలియన్ల మందికి వ్యాక్సిన్ లు వేయాలి. అంటే రేండు డోసులు కలిపి 600 మిలియన్ల మోతాదు వ్యాక్సిన్ అవసరం అవుతుంది.
మన దేశంలో ఎప్పటికంటే….
అయితే ఇప్పటికీ 45 మిలియన్ల డోసులు మాత్రమే జనాలకి అందించడం జరిగింది. ఇక ప్రస్తుతం వ్యాక్సిన్ వేస్తున్న రేటు ప్రకారం జాతీయ స్థాయిలో ఇమ్యూనిటీ సాధించడానికి అమెరికాలో ఒక ఏడాది పట్టొచ్చు. భారతదేశంలో అంతకన్నా ఎక్కువ సమయమే పడుతుంది. వృద్ధులు పిల్లలు సహా అందరికీ టీకాలు వేయాలి. దీన్నిబట్టి చూస్తే ఈ ఏడాది చివరికి…. లేదా వచ్చే ఏడాది మొదటి అందరూ ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ సాధించి మహమ్మారి అంతం అయిపోతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?