ప్రస్తుతం మానవాళి ని వణికిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ వ్యాపిస్తున్నట్లు హెచ్చరికలు వస్తున్నాయి. అయితే భారతదేశంలో దాని ప్రభావం ఇంకా మొదలు కాలేదు. ఈ క్రమంలో కరోనా మహమ్మారి భవిష్యత్తులో ఎంత ప్రమాదకరంగా మారుతుంది అనే విషయంపై సైంటిస్టులు అధ్యయనాలు చేశారు. ఈ క్రమంలో వారు కొన్ని నిజాలను వెల్లడించారు.
జంతువుల్లో కరోనా కణాలు….
ప్రస్తుతానికి డబ్ల్యూహెచ్వో కరోనా మహమ్మారి వ్యాప్తిని దాని ప్రభావాన్ని అంచనా వేసే ఈ క్రమంలో రెండు దశల ప్రణాళికలను తయారు చేసింది. ఈ పరిశోధనల్లో 194 సభ్యదేశాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. అయితే గబ్బిలాలు, పిల్లులు, సింహాలు, పులులు, కుక్కలల్లో కరోనా వైరస్ ను పరిశోధనలు గుర్తించాయి. ముఖ్యంగా గుర్తించిన ఆర్ ఎ టి జి 13 ఆర్ ఎం వై ఎన్ 02 జీనోమ్ లలో కరోనా వైరస్ తో 96.2%, 93.3% సారూప్యత ఉందని నిర్ధారణ చేయడం జరిగింది. అంటే మనుషుల నుండి జంతువులకి వైరస్ సంక్రమించే అవకాశాలను ముందు కొట్టేసిన వాళ్ళు ఇప్పుడు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు….
తాజాగా చైనా, హాంకాంగ్, బెల్జియం దేశాలలో కుక్కలు, పిల్లలు అలాగే అమెరికాలోని ఒక జూ లో పులులు, సింహాలకు కూడా ఈ వైరస్ వచ్చినట్లు తేలింది. మానవులతో అతి సన్నిహితంగా ఉండే జంతువులకు కరోనా వైరస్ సోకితే అది చాలా ప్రమాదకరం అని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేస్తోంది. తద్వారా అది మనుషులకు సోకే ప్రమాదం ఉన్నదని కాబట్టి జంతువులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పరిశోధకులు కూడా ఈ విధంగానే సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జంతువుల్లో వైరస్ రావడం అనేది నిజంగా భయం గొలిపే అంశమే
పెంపుడు జంతువులతో జాగ్రత్త సుమీ…!
అదే సమయంలో కోడి, బాతు, సీమ కోడి వంటి జంతువుల వల్ల వైరస్ సోకదని డబ్ల్యూహెచ్వో మరోసారి స్పష్టం చేసింది. కానీ కుక్కలు, పిల్లులు వంటి జంతువుల్లో దీనిని గుర్తించిన పరిశోధనల వల్ల రాబోయే రోజుల్లో మానవాళి మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు గమనార్హం. మొత్తానికి ఈ కరోనా వైరస్ ఇప్పటిలో ప్రజలను వదిలి తన ప్రభావం ఆపే అవకాశం లేదని స్పష్టం అవుతుంది. కాబట్టి ఈ జంతువులలో వైరస్ సోకే పరిశోధనపై మరి కొన్ని స్పష్టమైన ఆధారాలు వచ్చే వరకు ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండటం మేలు అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?