Elections : తనకు జరిగిన అన్యాయానికి సమాధానంగా ఒక దళిత మహిళ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పైనే పోటీకి దిగారు. కేరళలో జరుగుతున్న ఈ పరిణామం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
చంపి… దూలాలకి ఉరేశారు
వివరాల్లోకి వెళితే… కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ పైన ధర్మదం నియోజకవర్గం నుండి వలయార్ సిస్టర్స్ మాతృమూర్తి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఆమె ఇద్దరు కూతుళ్ళ పై అత్యాచారం జరిగింది. 2017 జనవరి 13న పెద్ద కూతురు (13), అదే ఏడాది మా చిన్న కూతురు 9 వాళ్ళ ఇంట్లోనే దూలాలకి ఉరి వేసుకుని చనిపోయారు. ఇక అత్యాచారం చేసి ఇలా తన కూతుళ్ళని ఉరి వేసిన వారి కి ఉరి శిక్ష అమలు చేయాలని ఆమె నాలుగేళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వానికి మొరపెట్టుకుంటూ నిద్రాహారాలు మానేసి వారి చుట్టూ తిరిగారు. అయితే ఎటువంటి ఫలితం రాలేదు.
నాలుగేళ్ళు అయినా….
ఏకంగా ఆక్రోశంతో శిరోముండనం కూడా చేయించుకున్న ఈ మాతృమూర్తి ఇప్పుడు ఆఖరి అస్త్రంగా అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆయన పైనే పోటీకి దిగారు. తాను కనుక గెలిస్తే తన కూతురికి జరిగిన అన్యాయం గురించి పూర్తిగా తెలుస్తుందని దోషులను తప్పించేందుకు సహాయం చేసిన వారిని రోడ్డు ఈడ్చవచ్చు అని ఆమె ఆశ అని…. అంతే కాని అధికారంపై తనకి ఎటువంటి యావ లేదని ఆమె చెప్పారు. “నాలుగేళ్లుగా దోషులకు శిక్ష పడుతుందని నాకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రివర్యులు ఆ మాట తప్పారు… ఇప్పటివరకు న్యాయపోరాటం చేసిన నేను ఇక నుండి రాజకీయ పోరాటం చేస్తానని” ఆమె అన్నారు.
Elections : పోరాటంతోనే న్యాయం?
చనిపోయిన ఇద్దరు బాలికలపై అత్యాచారం కూడా జరిగినట్లు పోస్టుమార్టంలో నిర్ధారణ కావడం గమనార్హం. తన ఇద్దరు బిడ్డలను పాడుచేసి చంపేసి దానిని ఆత్మహత్య అని క్రియేట్ చేశారు అని ఆమె ఫిర్యాదు చేస్తే… ఎటువంటి లాభం లేకుండా పోయింది. శవ పరీక్ష నివేదిక కూడా ఆమె చెప్పినట్లు వచ్చింది. ఇక ఆ తల్లిదండ్రులు తరఫున కేరళ వ్యాప్తంగా నిరసనలు కూడా జరిగాయి. ఐదుగురిని అప్పటికప్పుడు అరెస్ట్ చేశారు. అయితే వారికి ఉరిశిక్ష మాత్రం వేయలేదు. వారిలో ఒకరు కేసు విచారణలో ఉన్నప్పుడే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కొంతమంది పోలీసులు కేసును బలహీనపరిచారని ఆమె ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి న్యాయం చేయలేకపోయారు ప్రజలందరికీ అది తెలియాలని ఇప్పుడు తాను అసెంబ్లీ కి పోటీ చేస్తున్నట్లు ఆ మహిళ తన ఆవేదన వ్యక్తం చేశారు.