ఎన్నడూ లేని విధంగా ఏపీలో రాజకీయం ముదురుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయం కాకపోయినా.. రాజకీయంగా ఆన్ సీజన్ అయినా.. ఏకపక్షంగా అధికారం చేపట్టి వైఎస్ జగన్ సీఎం అయినా.. తెలుగుదేశానికి సరిపడా బలం లేకపోయినా.. రాష్ట్రంలో రాజకీయం మాత్రం రంజుగా సాగుతోంది. ఇప్పటికే ఉన్న వివాదాలు చాలవన్నట్టు మరో కొత్త వివాదం టిడిపికి, వైసీపీకి మధ్య భగ్గు మంటున్నది. విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం పార్టీలకు సెంటిమెంటు, అలవాటు. ఎప్పటి నుంచో కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ విగ్రహాలను ఎక్కడి కక్కడ పెడుతుంటే, వైసిపి వైఎస్సార్ విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి కూడలిలో ఏర్పాటు చేయించింది. ఈ క్రమంలోనే ఏపీలో ఇప్పుడు కొత్తగా విగ్రహాల చుట్టూ రాజకీయం అనుకుంటుంది. ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ విగ్రహాలను ఏపీలో తొలగిస్తుండటం వివాదాలకు దారితీస్తోంది.
ఎన్టీఆర్ విగ్రహాలు ఏం పాపం చేశాయని.. !
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదుల సంఖ్యలో ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించారు. అయితే వివాదాస్పదం కావడంతో కొన్ని చోట్ల మళ్ళి పున ప్రతిష్ట చేశారు. కానీ తూర్పు గోదావరి జిల్లా లోను, విశాఖపట్నం మధురవాడ లోనూ, నెల్లూరు జిల్లా ముసునూరులోనూ విగ్రహలు తొలగించి, ఎంత వివాదం అయినప్పటికీ తిరిగి ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు దీని చుట్టూ అగ్గి రాజుకుంటోంది. నెల్లూరు జిల్లాలో విగ్రహాల కూల్చివేతను నిరసిస్తూ వైసీపీ లోని ఒ నాయకుడు పార్టీకి రాజీనామా చేశారు.vఇది రాష్ట్రస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ విగ్రహాలను తొలగించాలి..ఉంచాలా అనేది స్థానిక సంస్థల బాద్యులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నిజానికి విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడే అనుమతులు తీసుకుని పెట్టాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి అనుమతులు లేకుండానే రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహాలు, దానికి అనేక రెట్ల సంఖ్యలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు ఏర్పాటయ్యాయి. కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో క్షేత్ర స్థాయిలో కొంత మంది నాయకులు అత్యుత్సాహంకు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహాలను కొల్లగొట్టే పనిలో పడ్డారు.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ విగ్రహాల సంగతి ఏంటి..?
ఇది ఉన్నత స్థాయిలో సీఎం జగన్మోహన్ రెడ్డో లేదంటే చంద్రబాబు నాయుడో పట్టించుకుంటున్న పెద్ద వ్యవహారం కాదు. గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయ ఉద్నుజ్ఞ పరిస్థితుల దృష్ట్యా స్థానిక నాయకులు అత్యుత్సాహానికి వెళ్లి విగ్రహాల తొలగింపునకు పూనుకుంటున్నారు. నిజానికి విగ్రహాలు తొలగించాల్సి వస్తే నిబంధనలు, అనుమతులు పరిశీలించాల్సి వస్తే రాష్ట్రంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి. 2011 నుంచి 2014 మధ్య కాలంలో వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా అనేక వేల సంఖ్యలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలు నెలకొల్పారు. సెంటిమెంట్ గా అది కలిసొస్తుందని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ అడ్డుచెప్పలేదు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత రాజశేఖర్ రెడ్డి విగ్రహల ఏర్పాటు తగ్గింది. ఎన్టీఆర్ విగ్రహాలు అంతకు పూర్వం నుండే ఉండేవి, వాటి జోలికి వెళ్ళలేదు. కానీ తాజాగా 2019లో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత మాత్రం మళ్లీ ఎన్టీఆర్ విగ్రహాలు అక్కడ అక్కడ కూలదోస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఇది సున్నిత అంశం. రాష్ట్ర స్థాయిలో వివాదాస్పదం కాకముందే స్థానిక నాయకులను నియంత్రించాల్సి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?