దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు తో ఎమ్మెల్యే రఘునందన్ విపరీతమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు. అయితే తన మీద తనకు నమ్మకం పెరగడమే కాకుండా తన సామర్థ్యాన్ని మరింత ఎక్కువ చేసుకుని అతను చూసుకుంటున్నట్లు అనిపిస్తుంది. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది… అలాగని నోరుజారకూడదు కదా….
వివరాల్లోకి వెళితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన రఘునందన్ తెలంగాణ పార్టీ పై విమర్శలకు దిగారు. ఇక అదే ఊపులో ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు అనవసరమైన వివాదాలకు కారణమయ్యాయి. ఎందుకో అర్థం కాలేదు కానీ కొలత వేసినట్లుగా రావలసిన మాటలు ఎమ్మెల్యే నోటినుండి పడ్డాయి. అంతే…. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి తప్పుగా మాటలు మాట్లాడారు…. దారుణమైన పరిస్థితిలో పడ్డాడు.
“నేను సైన్స్ టీచర్ ని… ప్రకృతిని నమ్ముతాను…. వెనకటికి ఒకాయన ఇట్లా మాట్లాడితే… పావురాల గుట్టల గట్లే పోయిండు…. నువ్వు కూడా అంతే యాక్షన్కు రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది: అని రఘునందన్ కెసిఆర్ను ఉద్దేశించి మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి జరిగిన పరిస్థితి తెలంగాణ సీఎం కేసీఆర్ కి కూడా వస్తుందని అన్నారు. అయితే దుబ్బాక ఎమ్మెల్యే వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అక్కడితో ఆగకుండా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయవద్దని సోషల్ మీడియాలో కొత్త ప్రచారానికి తెర తీశారు. అంతే… బిజెపికి వెన్నులో వణుకు పుట్టింది.
ఏం మంతనాలు జరిగాయో తెలియదు కానీ రఘు నందన్ ఒక్కసారిగా నష్టనివారణ చర్యలు చేపట్టారు. వైఎస్ కుటుంబంపై తనకు ఎలాంటి విరోధం లేదని చెప్పిన ఆయన గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను తాను గుర్తు చేసినట్లు తనను అపార్థం చేసుకోవద్దని కోరారు. తాను వైఎస్ అమలు చేసిన పథకాలు గురించి గతంలో మాట్లాడిన విషయాలను గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దు అని తాను తప్పుగా ఉద్దేశించి మాట్లాడలేదని ఆయన వివరించారు. తన మాటలు ఎవరినైనా బాధించినా…. తప్పుగా అర్థం అయినా…. తనను క్షమించాలని అన్నారు. ఇక వైఎస్ అభిమానులు రఘునందన్ వివణతో ఎంతవరకు సంతృప్తి చెందుతారో తెలియదు కానీ తమ సొంత ఎమ్మెల్యేనే భారతీయ జనతా పార్టీకి ఒక్కసారిగా వణుకు పుట్టించాడు.