Elections : ప్రస్తుతం దేశంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికలే హాట్ టాపిక్. బిజెపి మళ్లీ దేశవ్యాప్తంగా సత్తా చాటుతోందా లేదా కాంగ్రెస్ పుంజుకుంటుందా…? ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎలా ఉంటుంది అని చాలామంది ఎన్నో లెక్కలు మాట్లాడుతున్నారు. అయితే ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ నిర్వహించిన సర్వే ప్రకారం తాజా ఫలితాలు వచ్చేస్తాయి. ఇక తాజా ఎన్నికల అనంతరం బిజెపి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మిగిలిన పార్టీల భవిష్యత్తు ఇలా ఉండవచ్చని సర్వే ఇచ్చిన వివరాల్లోకి వెళ్తే…
Elections : తమిళనాడు
ఏపీ పొరుగు రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈసారి డీఎంకే-కాంగ్రెస్ మిత్రపక్షాలు బలంగా ఉన్నాయని… ఆ కూటమి విజయం సాధించవచ్చని అర్థం అవుతోంది. ఇక అధికార అన్నాడీఎంకే పై శశికల బయటకు వెళ్లిన తర్వాత ప్రజలకు వారి పై నమ్మకం కోల్పోయింది అని… దీంతో బీజేపీ అన్నాడీఎంకే మిత్రపక్షాలకు దారుణ పరాజయం ఖాయమని టైమ్స్ నౌ సర్వే వెల్లడించింది. కమలహాసన్ తో పాటు ఇతర పార్తీలకు పెద్దగా సీట్లు వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పింది. తాజా సర్వే ప్రకారం కాంగ్రెస్-డిఎంకె కూడికలు 173 నుండి 181 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారట. ఇక అధికార పార్టీ విషయానికి వస్తే కేవలం నలభై నుండి యాభై మూడు స్థానాలు మాత్రమే వారు సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు,
కేరళ
150 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో అనుకున్నట్లే వామపక్ష కూటమి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సర్వే తెలిపింది. పినరయ్ ప్రభుత్వం పైన ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ మళ్లీ వారే అధికారంలోకి వస్తారట. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలకు అయిన యుటిఎఫ్ గతంతో పోలిస్తే ఎక్కువ సీట్లు రావచ్చని కానీ అధికారాన్ని సొంతం చేసుకునే అవకాశం ఏమాత్రం లేదని తేల్చారు. అయితే మార్జిన్ మాత్రం ఈ రెండింటి మధ్య చాలా తక్కువ ఉంది. ఎల్డీఫ్ 77 సీట్లు సొంతం చేసుకుంటే… ఇదే సమయంలో యూడీఎఫ్ 62 సీట్లకు పరిమితం అవుతుందని అంటున్నారు. ఇక్కడ ఇండిపెండెంట్లు, చిన్న పార్టీలు కీలకం కానున్నారు.
Elections : అస్సోం
ఇక్కడ అధికారపక్షంగా భారతీయ జనతా పార్టీ ఉంది. 126 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో బిజెపి తిరిగి అధికారం సొంతం చేసుకోబోతుందట. హోరాహోరీగా సాగబోయే ఎన్నికల్లో స్వల్ప అధిక్యతతో బిజెపి అధికారంలో ఉంటుందని సర్వే తెలియజేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి గట్టిపోటీ ఇస్తుందని… అయితే ఫలితం మాత్రం ఎన్డీయేకే అనుకూలంగా ఉన్నట్లు తేల్చారు. కాంగ్రెస్ నేత్రత్వంలోని మహాజోత్ కూటమి 52 నుండి 60 స్థానాలు మధ్య గెలుచుకుంటే… ఎన్డీయే 65 నుండి 73 స్థానాలను సొంతం చేసుకోనుందని సర్వే పేర్కొంది
పుదుచ్చెర్రీ
ఈ చిన్న రాష్ట్రంలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించే అవకాశం ఉందని టైమ్స్ నౌ సర్వే తెలియజేసింది. ఎన్డీఏకు 19 నుండి 23 స్థానాల్లో వచ్చి అధికారం సాధిస్తే కాంగ్రెస్ డీఎంకే 7 నుంచి 11 స్థానాలను మాత్రమే పరిమితం కానున్నట్లు వెల్లడించారు. ఇక తుది ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?