Foreign media: అంతర్జాతీయ మీడిాయ Foreign media ‘మందు కంటే విషమే త్వరగా పని చేస్తుంద’నేది ఓ మాట. ప్రస్తుతం జరుగుతోంది అదే. భారత్ లో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతపై ప్రపంచ మీడియా ఆందోళన ఎక్కువైపోయింది. భారత్ లో పరిస్థితులు ప్రపంచానికి గుణపాఠం కావాలని ఓ పత్రిక రాస్తే.. ప్రపంచాన్ని భారత్ తో ముప్పు వచ్చేలా ఉంది.. అంటూ మరో పత్రిక రాసింది. వీరి రాతలు భారత్ పై సానుభూతి చూపడం, సాయం చేయాలి అనేకంటే.. తమకేం ప్రమాదం వస్తుందో అనే ఆందోళన కనిపిస్తోంది. భారత్ పై ఏమైనా అక్కసు ఉండుంటే.. సెకండ్ వేవ్ తీవ్రత, ఆక్సిజన్ కొరత, మరణాల పరిస్థితులను చూపించి మొత్తం భారత్ పై తప్పును నెట్టేస్తున్నాయి. గతేడాది భారత్ చూపిన చొరవ, ప్రపంచంలోనే మొదటి కరోనా వ్యాక్సిన్ తెచ్చిన ఘనతను పక్కన పెట్టేశాయి.
ది గార్డియన్, ది వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీల జర్నల్, దిటైమ్స్.. ఇలా అంతర్జాతీయ పత్రికలు గతేడాది భారత్ లో చేపట్టిన చర్యలు, లాక్ డౌన్ పై ప్రశంసలు కురిపించినవవే. కానీ.. అనుకోని ఉత్పాతం రూపంలో కేవలం వారంలో మారిపోయిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం గతాన్ని వదిలేసింది. మొత్తం ఈ ఉత్పాతానికి కారణం భారత్.. అనేంతగా విషం కక్కుతున్నాయి. చైనా నుంచి వచ్చిన కరోనా.. ప్రపంచాన్నే పట్టి వదలడం లేదని రాయక.. భారత్ లో పరిస్థితుల మున్ముందు ఏ పరిస్థితికి దారి తీస్తాయో అంటున్నాయి. బ్రిటన్ లో స్ట్రెయిన్, దక్షిణాఫ్రికాలో మ్యూటేషన్.. ఈ ఉపద్రవానికి మొదటి కారణం. అక్కడి నుంచే మొదలైందన్న విషయాన్ని వదిలేశాయి.
కాశీలో ప్రతిరోజూ జరిగే మృతదేహాల ఖననాన్ని, పుణ్యం వస్తుందనే భారతీయుల నమ్మకాన్ని కూడా ఫైనాన్సియల్ టైమ్స్ కరోనా వేవ్ లో కలిపేసింది. ప్రపంచాన్ని పట్టి పీడించేస్తున్న కరోనా మహమ్మారికి తొలిగా వ్యాక్సిన్ కనుక్కున్న విషయాన్ని.. అనేక దేశాలకు ఎగుమతి చేసి సాయం అందించిందనే విషాయాన్ని కూడా పక్కనపెట్టేశాయి. ప్రపంచ మీడియాకు ఇవేమీ కనిపించకపోవడం శోచనీయం. ప్రజల నిర్లక్ష్యం.. వ్యాక్సిన్ ఉందనే ధైర్యం.. ఇంతటి ఉపద్రవం ఊహించని ప్రభుత్వ ఉదాసీనత ఈరోజు పరిస్థితికి కారణాలయ్యాయి. అన్నింటికీ మించి పేద దేశాలకు వ్యాక్సిన్ పంపించి ఉదారత చాటుకోవడం మంచే అయినా మన దేశంలో వ్యాక్సినేషన్ ముందే ఉధృతం చేయకపోవడం తప్పయింది..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?