ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. ఎక్కడ చూసినా అవే వార్తలు. ఒక్క భారతదేశంలోనే ప్రెతీ రోజు వందలకొద్దీ మరణాలు. ఇక ఆశలన్నీ వ్యాక్సిన్ పైనే. డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ రోజూ అడ్మిట్ అవుతున్న వేలాది పేషెంట్లకు న్యాయం చేయలేని పరిస్థితి. ఈ సమయంలో కరోనా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలను ప్రముఖ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. ఆయన గురించి అందరికీ తెలిసిందే. హైదరాబాద్లో ప్రత్యేకంగా కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేసి మరీ వైద్యం అందిస్తున్నాడు. ఈ వివరాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
వివరాల్లోకి వెళితే… వెంటిలేటర్ అవసరం లేకుండానే ‘హై ఫ్లో ఆక్సిజన్ ద్వారా’ ప్రాణాలను కాపాడుకోవచ్చు అని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి చెబుతున్నారు. ఇక వివరంగా తెలుసుకుంటే కరోనా వైరస్ శ్వాసకోశాల్లోకి ప్రవేశిస్తుందని అక్కడే సమస్యలు సృష్టిస్తుందని భావించే వాళ్ళం అందరం. కానీ అది రక్తంలో కూడా ప్రవహిస్తుంది అని చెచ్చి షాక్ ఇచ్చారు డా. నాగేశ్వర్ రెడ్డి. వ్యాక్సిన్ వచ్చేందుకు కనీసం మరో ఆరు నెలల సమయం పడుతుంది. ఈ లోపల కరోనా సోకిన వారి ప్రాణాలను కాపాడాలి. దానికి మెరుగైన వైద్య సేవలు అవసరం. వైరస్ రక్తం లోకి ప్రవేశించింది అంటే అది చాలా ప్రమాదకరం. కావున వెంటిలేటర్ కన్నా ప్రస్తుతం అతి ప్రభావవంతమైన, ముఖ్యమైన ప్రక్రియ ఈ ‘హై ఫ్లో ఆక్సిజన్.’
వైరస్ ఆక్సిజన్ లోకి ప్రవేశించడం వల్ల రెండు వారాలలో రక్తంలోని ఆక్సిజన్ శాతం 95 కంటే తక్కువ పడిపోతుంది. శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. 90 శాతం కంటే తక్కువ ఉంటే అత్యవసరంగా ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. కొందరిలో అయితే ‘హ్యాపీ హైపాక్సియా’ ఉంటుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం 80-85 ఉన్నా కూడా పైకి మామూలుగా కనిపిస్తారు. ఉన్నట్టుండి పరిస్థితి విషమించి నేరుగా గుండెపై వైరస్ తన ప్రభావాన్ని చూపుతుంది.
ఇలాంటి వారికి మొదటి వారంలో యాంటీవైరస్ మందులు ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనవి రెండు…. మనందరికీ తెలిసినవే. ఫావిపిరవిర్, రెమిడేసివిర్. ఇవి రెండూ చాలా ప్రభావవంతం, ఖరీదు కూడా ఎక్కువ. ఆ తర్వాత మనిషి పరిస్థితికి తగ్గట్టు, అతనిలో బయటపడే లక్షణాలకు తగ్గట్టు ‘డెక్సామిథాసోన్’, స్టెరాయిడ్స్ వంటివి ఇస్తారు. ఆక్సిజన్ ఇస్తూ స్టెరాయిడ్స్ చికిత్స అందించడం వల్ల 99 శాతం మందిలో మూడు రోజుల్లోనే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి.
ఆ తర్వాత సాధారణంగా ముక్కు ద్వారా అందించే ఆక్సిజన్ వల్ల ఎక్కువ మందిలో 2 నుండి 10 లీటర్ల ఆక్సిజన్ సరిపోతుంది. అది సరిపోకపోతే ‘నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్’ విధానంలో ఆక్సిజన్ ను అందిస్తారు. ఇటీవల ‘నాసల్ కేథటర్’ ద్వారా కొత్తగా ‘హై ఫ్లో ఆక్సిజన్’ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తాయి. ఇది ఇస్తే వెంటిలేటర్ పై చికిత్స అవసరమే లేదు. ‘ఈ హై ఫ్లో ఆక్సిజన్’ ప్రక్రియ రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగేళా చేసి వైరస్ కణాలను నిర్వీర్యం చేస్తుంది… వ్యాక్సిన్ వచ్చేలోపు మనిషి ప్రాణాలను నిలబెడుతుంది.