అమానవీయంగా రేప్ చేయడమే కాకుండా ఆమె ప్రైవేట్ భాగాలను ఛిద్రం చేశారు దుర్మార్గులు. ఈ దుర్మార్గానికి ఓ మహిళ కూడా సహకరించడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది.
ఇలాంటి ఘటనలు జరుగుతుంటే… కరోనా లాంటి రోగాలు రాకుండా ఎలా ఉంటాయ్… సిగ్గులేని జనం… సిగ్గులేని వ్యవస్థలు… 75 ఏళ్ల మహిళను రేప్ చేస్తార్రా… మీరు మనుషులా.. మృగాళ్లార్రా…కేరళలో జరిగిన సంఘటన దేశ ప్రతిష్టను మంటగలుపుతోంది. కేరళలోని ఎర్నాకులంలో 75 ఏళ్ల వృద్ధులిని రేప్ చేయడమే కాకుండా తీవ్రంగా గాయపర్చారు. ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఆ మహిళ ఇప్పుడు చికిత్స పొందుతోంది. వయసును కూడా లెక్కచేయకుండా… ఆమెను హింసించి, మానసికంగా వేధించారు దుండగులు. తీవ్రంగా గాయపడిన మహిళ… వైద్యానికి సహకరిస్తుందని… త్వరలోనే పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు.
మొత్తం ఘటనలో పాత్ర ఉందని భావిస్తున్న 66 ఏళ్ల మహిళ విచారణలో ఎన్నో విషయాలు బయటకు వస్తున్నాయ్. మహిళ అనారోగ్యంగా ఉందని… అది కూడా పట్టించుకోకుండా.. ఆమెను ఎంతగానో హింసించినట్టు పోలీసుల విచారణలో తేలింది. మహిళను రేప్ చేసిన సెప్తుజెగేరియన్ ను అనే దుర్మార్గుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిలో ఒకరే మహిళను రేప్ చేసినప్పటికీ… ఇద్దరు మద్యం మత్తులో ఇష్టానుసారం గాయపర్చారని ఎర్నాకులం పోలీస్ చీఫ్ కార్తీక్ చెప్పారు. ఐతే మహిళకు మతిమరుపు, అనారోగ్య సమస్యలతో సతమతమవుతోందన్నారు. జననాంగాలతోపాటు, చెస్ట్ పైనా మహిళకు తీవ్ర గాయాలయ్యాయని… సోమవారం మహిళకు అత్యవసరంగా సర్జరీ చేసినట్టు తెలిపారు.
ఢిల్లీలో నిర్భయ సంఘటన ఒళ్లు గుగుర్పెట్టేలా చేసింది. భారతదేశాన్ని ప్రపంచం ముందు తల దించుకునేలా చేసింది. నిర్భయను అతి కిరాతంగా రేప్ చేసి ఆమె ప్రాణాలు బలిగొన్న దుర్మార్గులు ఇటీవలే న్యాయస్థానాలు ఉరిశిక్ష విధించాయ్. మహిళలను అమానుషంగా రేప్ చేస్తూ… వారిని అంతమొందిస్తున్నవారిని వ్యవస్థలు చీల్చిచెండాతూనే ఉన్నాయ్. ఇటీవల హైదరాబాద్ లో దిశను రేప్ చేసి చంపేసిన ఉన్మాదులు ఎన్కౌంటర్ చేశారు. ఓవైపు కరోనాతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుంటే… ఇలా మహిళల పట్ల సాగిస్తున్న అకృత్యాలకు వారికి కేపిటల్ పనిష్మెంట్ ఇవ్వాల్సిందే.