అదనపు పిటీషన్ దాఖలు చేసిన పిటీషనర్
ఏపీలో ప్రభుత్వం న్యాయప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందంటూ దాఖలైన పిటీషన్ పైన హైకోర్టు కీలక సూచనలు చేసంది. ఇప్పటికే దాఖలైన పిటీషన్ కు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని కోరింది. అయితే, పిటీషనర్ గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుతో పాటుగా అదనపు సమాచారంతో మరో పిటీషన్ దాఖలు చేసారు. రెండూ కలిపి ఒకే పిటీషన్ గా దాఖలు చేయాలని ఆదేశించిన హై కోర్టు ఈ కేసును తిరిగి ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. టీడీపీ మద్దతు మీడియాలో ఈ కధనాలు రావటంతో..దీని ఆధారంగా న్యాయవాది శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీనిని విచారణకు స్వీకరించిన హైకర్టు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ రోజులోగా దాఖలైన పిటీషన్ పైన సమాధానం ఇవ్వాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించింది. అదే సమయంలో ఈ అంశం పైన విచారణకు ఆదేశిస్తే అభ్యంతరం ఏంటంటూ కోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. కాగా.. ఈ కధనం ప్రచురించిన మీడియా సంస్థను కేసులో ఇంప్లీడ్ చేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరగా..కోర్టు పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది. ఈ పరిస్థితుల్లో ఈ రోజు జరిగిన విచారణలో హైకోర్టు దీని పైన ఈ మేరకుఉత్తర్వులు జారీ చేసింది.
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎన్నో ట్విస్టులు
ఇప్పటికే ఇదే అంశం పైన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధానికి లేఖ రాసారు. ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేలా టెలిగ్రాఫిక్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీలో కొన్ని వర్గాల వారిని ప్రభుత్వం టార్గెట్ చేసుకొని వారి ఫోన్లను ట్యాప్ చేస్తుందని తన లేఖలో ఫిర్యాదు చేసారు. ఇక, దీనిని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం..తొలుత ఈ కధనం ప్రచురించిన మీడియా సంస్థకు లీగల్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ అంశం పైన కేంద్ర సంస్థలతో విచారణ చేయించాలని చంద్రబాబు తన లేఖలో ప్రధానిని కోరగా… హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ లో పిటీషనర్ ఇదంతా ప్రత్యేకంగా ఒక పోలీసు అధికారిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేయిస్తున్నారని పేర్కొన్నారు. దీని పైన సీబీఐతో విచారణకు ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు. రెండు వైపుల వాదనలు విన్న హైకోర్టు సర్వీసు ప్రొవైడర్లకు నోటీసులు జారీ చేసింది. ఇక, ఈ రోజు జరిగిన విచారణ తరువాత ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.