గత కొద్దికాలంగా తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ భయంకరంగా విస్తరించినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ కఠినంగా అమలు చేశారు. ఇక హైదరాబాద్ మహానగరం అయితే పూర్తిగా పోలీసులు కంట్రోల్ లోకి వెళ్లి పోయింది. ఇక ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైరస్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో మరియు ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించవలసిన బాధ్యతను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ రంగాలకు సడలింపులు ఇస్తూ కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుంది.
అయితే లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి రాష్ట్రంలో మద్యం ఎక్కడ దొరకలేదు కాబట్టి హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను ఆపివేశారు. కానీ లాక్ డౌన్ 3.0 కింద రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరిచిన నేపథ్యంలో కొద్ది రోజులు కూడా ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు పోలీసు వారు నిర్వహించలేదు. ఇప్పుడు తాజాగా వచ్చిన కొత్త నియమాలు మరియు సడలించిన కొత్త అంశాల నేపథ్యంలో మళ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను నగరవాసులకు నిర్వహించాలని పోలీసులకు ఉన్నతాధికారుల నుండి ఖచ్చితమైన ఆదేశాలు వచ్చాయి.
ఇన్ని రోజులు లు ఎవరైనా తాగి వెళ్తున్నా ఏమి చేయలేకపోయిన పోలీసులు అంతా ఇప్పుడు ఒక్కసారిగా తాగి వాహనం నడుపుతున్న వారి పై విరుచుకుపడుతున్నారు. వేలకు వేలు ఫైన్ లు వేయడం.. వారి వాహనాలను సీజ్ చేయడం, పక్క రోజే వారి కేసుని కోర్టు ముందు ప్రవేశ పెట్టడం (ఆన్ లైన్ హియరింగ్) వంటివి త్వరగా జరిగిపోతున్నాయి. ఈ మేరకు పుత్లిబౌలి చౌరస్తాలో బోల్తా కొట్టిన ఆటో డ్రైవర్ కు పరీక్షలు నిర్వహించగా, 187 బీఏసీ కౌంట్ వచ్చింది. దీంతో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాకుండా కరోనా తీవ్రత ఉన్న నేపథ్యంలో మాస్కులు లేకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వచ్చిన వారిపైనా పోలీసులు కొరడా ఝళిపించారు. కాగా మాస్క్ లేనివారిపై రూ. 1000 జరిమానా విధిస్తున్నామని వెల్లడించిన ఆయన, గడిచిన రోజులో 395 మందిపై జరిమానా విధించామని పోలీసు అధికారులు అధికారికంగా వెల్లడించారు.