India debt : కేంద్రంలో మోడీ సర్కారు దేశాన్ని తెగ పరిపాలిస్తోంది అని వారి కార్యకర్తలు సంబరపడిపోతే తెగ సంబరపడిపోతుంటే చివరికి వారి వెన్ను విరిగే నిజం ఒకటి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. కేంద్రంలో మోడీ పాలన అప్పు చేసి పప్పు కూడు అన్నట్లు తయారైంది. భారత ప్రభుత్వం దగ్గర అప్పుల కుప్ప ఒకవైపు నిండి కిందకి జారిపోతుంటే… మరొకవైపు దేశంలోని కార్పొరేట్ దిగ్గజాలు మాత్రం ప్రతి ఏడాది లక్షల కోట్ల సంపాదన అర్జిస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం అని సామాన్యులు నోరెళ్లబెడుతారు.
ఇక సోషల్ మీడియాలో ఆరోపణలు ఏమిటంటే…. భారత ప్రభుత్వం తెచ్చిన కోట్ల అప్పు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి అంబానీ, అదానీల వద్దకు వెళుతుందని… ప్రజలను దోచేసి… అంతా పట్టుకెళ్ళి బడా వ్యాపారవేత్తల నోట్లో పెట్టే కార్యక్రమం జరుగుతోందని ధ్వజమెత్తుతున్నారు. భారతదేశం లెక్కల ప్రకారం మన్మోహన్ సింగ్ ప్రధానిగా గద్దె దిగిన నాటికి 48 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇక మోడీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరేడేళ్లలో ఏకంగా 100.07 లక్షల కోట్లకు అది పెరిగి పోయింది. అంటే ఏకంగా కోటి కోట్ల రూపాయలు అన్నమాట. 7 ఏళ్ల లోనే 60 లక్షల కోట్ల అప్పు బిజెపి ప్రభుత్వం చేయడం గమనార్హం.
మరో వైపు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందో ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం. ఇన్ని అప్పులు చేసి జనాలకు రూపాయి విదిలించడం లేదు. జిఎస్టి పేరిట మాత్రం కోట్లకు కోట్లు పన్నులు వసూలు చేస్తోంది. వాటితో అప్పు తీర్చడం అనేది అత్యాశ అయినప్పటికీ… తిరిగి ప్రజల వద్దకు డబ్బు వస్తున్న దాఖలాలు లేవు. ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకి పెట్టడం తప్పితే సామాన్యులకు నయాపైసా ఉపయోగం రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పైపెచ్చు అప్పును అధిక ధరల రూపంలో మన పైనే రుద్దుతున్నారు. ప్రజలకు మాత్రం ఆదాయం చూపించకుండా కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఫ్యాక్టరీలను, సంస్థలను అమ్మేసి వారి ఇష్ట ప్రకారం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి విమర్శలకు బిజెపి చెక్ చెబుతుందా లేదా…? కనీసం సమాధానం అయినా త్వరలో చెప్పే అవకాశం ఉందా..?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?