India Lockdown: దేశంలో కరోనా కోరలు చాచింది. వరుసగా పది రోజుల నుండి మూడున్నర లక్షల కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద మన దేశంలోనే ఎక్కువ కేసులు నమోదయ్యే స్థితికి చేరుకున్నాం. గత ఏడాది రోజుకి పది, పదిహేను కేసులు ఉన్నప్పుడే లాక్ డౌన్ పెట్టారు. ఇప్పుడు మాత్రం రోజుకి మూడు లక్షలు కేసులు దాటుతున్నా లాక్ డౌన్ పెట్టడం లేదు. కొన్ని రోజుల కిందట ప్రధాని మోడీ కూడా మీడియా ముందుకి వచ్చి లాక్ డౌన్ ఉండదు అనే సంకేతాలిచ్చారు. కానీ పరిస్థితి మారింది. రెండు రోజుల నుండి సుప్రీమ్ కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తుంది. మరోవైపు అంతర్జాతీయ నిపుణులు కూడా భారత్ కి తాళాలు వేయాల్సిందే అంటూ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో…
India Lockdown: లాక్ డౌన్ తో తగ్గే అవకాశం ఉందా..!?
ఇప్పుడు మూడున్నర లక్షల కేసులు వస్తున్నాయి. గత నెల ఇదే సమయానికి రోజుకి లక్ష కేసులు ఉండవు. ఏప్రిల్ 15 నాటికి రెండున్నర లక్షలకు చేరుకున్నాయి. ఈ క్రమంలో లాక్ డౌన్ లేకపోతే కచ్చితంగా ఈ సంఖ్య అయిదు లక్షలకు చేరుతుంది. నిజానికి గత ఏడాది లాక్ డౌన్ సమయంలో కేసుల నమోదు తక్కువగానే ఉంది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాతనే కేసులు భారీగా మొదలయ్యాయి. జనం స్వేచ్ఛగా తిరగడం మొదలు పెట్టేసాక… గత ఏడాది జూన్ నుండి కరోనా విపరీతంగా వ్యాపించడం ఆరంభమయింది. మార్చి నుండి మే వరకు సగటున రోజుకి 1800 కేసులు నమోదవ్వగా… జూన్ నుండి ఆగష్టు వరకు రోజుకి సగటున 32 వేల కేసులు… ఆగష్టు చివరి నుండి అక్టోబర్ వరకు రోజుకి సగటున 70 వేల కేసులు నమోదయ్యాయి..!
* గత ఏడాది కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా దేశం బాగా దెబ్బతినింది. దేశం మొత్తం మీద 14 వేలకు పైగా హోటళ్లు.., 21 వేల చిన్న దుకాణాలు మూత పడ్డాయి. అన్ని రంగాల్లో కలిపి దాదాపు పదిహేను కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. దాదాపు రెండున్నర కోట్ల మంది ఆకలి చావులతో ఊపిరి వదిలారు. కరోనా నష్టాలు పేరిట వ్యాపారాలు మూత పడ్డాయి. ఇప్పటికీ కొన్ని రంగాల్లో అధిక ధరలు వసూలు చేస్తున్నారు. మొత్తం మీద దేశము దాదాపు 3 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయింది. ఇవన్నీ కరోనా లాక్ డౌన్ దేశానికి చేసిన నష్టం. కరోనా కంటే లాక్ డౌన్ చేసిన గాయం దేశానికి ఎక్కువ తగిలింది.
తప్పదు.. కనీసం నెల రోజులు..!?
అయితే కేసుల సంఖ్య కచ్చితంగా రోజుకి అయిదు లక్షలకు చేరుతుంది అంటున్నారు. సో.. కేసుల సంఖ్య పెరగకమునుపే.. మరీ దారుణ పరిస్థితులకు వెళ్ళక మునుపే దేశాన్ని లాక్ డౌన్ చేస్తే ఎంతో కొంత నియంత్రణలో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సహా.. ప్రపంచ ఆరోగ్య పరిశోధకులు సంకేతాలిస్తున్నారు. మరోవైపు సుప్రీమ్ కోర్టులో కేసుల విచారణ సందర్భంగా సూటిగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇన్ని రాజుగున్నా ప్రధాని మాత్రం ఆర్ధిక నష్టాలు ఆలోచించి లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవట్లేదు. కానీ.. తప్పని పరిస్థితుల్లో దేశం మొత్తం రెండు దశల్లో కనీసం నెల రోజులు లాక్ డౌన్ విధించే అవకాశాలున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు..!