Corona Virus: కరోనా వైరస్ Corona Virus దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గలేదు. వేలల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ గా ఉంటున్నాయి. నిత్యం పరిస్థితులు పర్యవేక్షిస్తున్నాయి. ఓవైపు కరోనా కట్టడి, మరోవైపు వ్యాక్సినేషన్ పై దృష్టి సారిస్తూనే ఉన్నాయి. రాష్ట్రాల్లో లాక్ డౌన్, కర్ప్యూ నిబంధనలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో దేశం ఊరట చెందే విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడచిన 24 గంటల్లో కరోనా కేసులను ప్రకటించింది. ఈ లెక్కల ప్రకారం దేశంలో కరోనా కేసుల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించింది.
గత 24 గంటల్లో 86,498 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 2,123 గా నమోదయ్యాయి. గడచిన 66 రోజుల్లో ఇంత తక్కువగా.. లక్షకు దిగువన కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దేశంలో మే నెల మొత్తం కరోనా కేసులతో దేశం విలవిల్లాడిపోయింది. గత నెల ఇదే రోజున 4,14,188 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 2032గా నమోదైంది. ఈలెక్కన చూస్తూ దేశంలో కరోనా కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టినట్టే. అయితే.. ఈ లెక్కలను బట్టి మాత్ కరోనా తీవ్రత తగ్గిందని భావించే పరిస్థితి లేదు. ప్రస్తుతం దేశంలో 13,03,702 యాక్టివ్ కేసులున్నాయి. 2,73,41,462 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
Read More:Corona virus in India : నిర్లక్ష్యమే నిలువెల్లా..! కరోనా నుంచి భారత్ కోలుకునేదెలా..?
ఇది దేశ ప్రజలకు ఊరటనిచ్చే విషయమే అయినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేలిగ్గా తీసుకోవడం లేదు. మహారాష్ట్రలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. సినిమా ధియేటర్లు తెరవడం, కొన్ని నగరాల్లో లాక్ డౌన్ సడలింపులు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో లాక్ కొనసాగింపు జరుగుతోంది. జూన్ 10 నుంచి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మినహాయింపుతో ఏపీలో లాక్ డౌన్ జూన్ 20 వరకూ పొడిగించారు. తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది. మరోవైపు జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని కేంద్రం ప్రకటించింది. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే.