ఇలాంటి ఘనటలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
విజయవాడ కోవిడ్ కోర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని… కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానంటూ… నిర్లక్షవైఖరిని త్రీవంగా పరిగణించాలంటూనే ప్రభుత్వానికి సైతం ఆయన కొన్ని సూచనలు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ ఓ జర్క్ ఇచ్చారు సీఎం జగన్మోహన్ రెడ్డికి. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి అనేక విషయాల్లో చిరంజీవి బాసటగా నిలిచారు. మూడు రాజధానులను బలపర్చారు. వైజాగ్ రాజధాని ప్రతిపాదనను స్వాగతించారు. సినీ ఇండస్ట్రీకి వైజాగ్ మణిహారంలా నిలుస్తుందన్నారు. అయితే తాజాగా మొత్తం పరిణామాలు మారిపోతున్నాయ్…
ఎప్పుడు ఎవరు హీరో అవుతారో…
రాజకీయాలు ఎప్పుడూ 1+1=2 కావు… కొన్ని సార్లు జీరో అవుతాయ్. మరికొన్ని సార్లు డబుల్, త్రిబుల్ కూడా అవుతాయ్. రాజకీయాల్లో ఏ రోజుకు ఆ రోజే ప్రాధాన్యత ఉంటుంది. ఒక్కోసారి మిత్రుడు శత్రువుగా మారిపోతాడు. మరోసారి శత్రువు మిత్రుడుగా మారిపోతాడు. పరిస్థితులు, కులం కూడా అందుకు కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే… తమ్ముడు సొంత పార్టీ పెట్టుకొని జనసేనతో ఎన్నికల్లో పోరాటం చేస్తే… చిరంజీవి… సొంత పార్టీ కాంగ్రెస్ సైతం దూరంగా ఉన్నారు. పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. గత ఎన్నికల్లో బీజేపీ చిరంజీవిని తమవైపుకు తిప్పుకోవాలని ప్రయత్నించింది. అయితే అది వర్కౌట్ కాలేదు. కానీ ఇప్పుడు ఏపీ బీజేపీ చీఫ్గా సోము వీర్రాజు రావడంతో మొత్తం సినారియా మారిపోతున్నట్టు కన్పిస్తోంది.
సోమూతో భేటీ తర్వాత మారిన పంథా…
ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు కలిశారు. ఆయనతో రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులు… రాజధాని వ్యవహారం… వైజాగ్ కేపిటల్ షిఫ్ట్ వ్యవహారంలో చిరంజీవితో సోము వీర్రాజు మాట్లాడారు. పార్టీ ని అభివృద్ధి చేయడంలో జనసేన పార్టీ అధ్యక్షుడు , మిత్రుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సహాయసహకారాలు తీసుకొని ముందుకు వెళ్లాలంటూ చిరంజీవి సూచించారని… ఆయన చేసిన సూచన తప్పక పాటించి బీజేపీ-జనసేన పొత్తును ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ శక్తిగా నిలుపుతామంటూ ఈనెల 6న సోము వీర్రాజు ట్వీట్ చేశారు. పవన్ కల్యాణ్ తో కలిసి… కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని,2024లో బీజేపీ,జనసేన ఉమ్మడిగా అధికారం చేపట్టాలని చిరంజీవి కోరినట్టుగా సోము వీర్రాజు ఆకాంక్షించారు. ఆ తర్వాత రోజు సోము వీర్రాజు… జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఏపీలో బీజేపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణపై ఇద్దరం చర్చించినట్టు చెప్పారు.
ఇక జగన్ సర్కారుకు చుక్కలేనా…?
ఇక కాస్కోండి జగన్… ఇప్పుడు ఏపీలో ఓ విచిత్రమైన పరిస్థితి కన్పిస్తోంది. అందరూ కలిసి అధికార పార్టీపై దాడికి వారి వారి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. అందుకు రాజధాని, కులం… ఈ రెండు అంశాలు కూడా ప్రామాణీకంగా మారిపోబోతున్నాయ్. సో… ఇప్పుడు చిరంజీవి ఒక లైన్ తీసుకొని అడుగులు వేస్తారా… లేదంటే… ఇష్యూలను బట్టి స్పందిస్తారన్నది చూడాల్సిందే. విజయవాడ ప్రమాదం ఘటన లాంటి ఇష్యూలో ఏపీలో అనేకం జరుగుతున్నాయ్. చిరంజీవి ఇప్పుడు సర్కారుకు చేసిన సూచన వెనుక రాజకీయం ఉందా… లేదా అన్నది తేలాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే…