ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రభుత్వం వెళ్తూవెళ్తూ భారీగా కొత్త ప్రభుత్వం పై వేసిన పెండింగ్ బిల్లుల వల్లే కాకుండా ఈ కరోనా సంక్షోభం వలన రాష్ట్ర ప్రభుత్వం భారీగా నష్టపోయింది. ఒకానొక సమయంలో ఉద్యోగులకు సరిగ్గా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో ఆయన 15 వేల కోట్ల రూపాయలు ఒకే దెబ్బకు చెల్లించడం ఏమిటన్నది ఆశ్చర్యం కలిగించవచ్చు. అసలు ఏమైందో మీరే చూడండి….
బాబు చేసిన ఘనకార్యం….
దాదాపు 60 వేల కోట్ల పెండింగ్ బిల్లులను చంద్రబాబు ప్రభుత్వం వెళుతూ వెళుతూ అలాగే పెండింగ్ లో పెట్టి వెళ్ళిపోయింది. ఈ పరిస్థితిని చక్కదిద్దడం మొదటిసారి అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వానికి సవాల్ అని చెప్పాలి. క్రమక్రమంగా పెండింగ్ బిల్లులను జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఒకేసారి 14 వేల 36 కోట్ల రూపాయలను క్లియర్ చేసింది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని దేశమంతా ఎదుర్కొంటున్న సమయంలో ఒకేసారి 15 వేల కోట్ల రూపాయలను చెల్లించడం అంటే చిన్న విషయం కాదు.
వేటికెంత?
వీటిలో 8,655 కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ కు సంబంధించి భారీగా బకాయి ఉండిపోగా…. చంద్రబాబు ఆరోగ్య స్థితికి సంబంధించిన 680 కోట్లు చెల్లించకుండా వెళ్లగా ఆ సొమ్మును కూడా వైసీపీ ప్రభుత్వం క్లియర్ చేసింది. రైతుల సున్నా వడ్డీ బకాయిల కోసం 1,150 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇక చంద్రబాబు ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు, విత్తనాలు సబ్సిడీ 384 కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ 1880 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్లగా వాటిని క్లియర్ చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది.
సూపర్ అంతే….
అలాగే చంద్రబాబు ప్రభుత్వం మిగిల్చిపోయిన పెండింగ్ బిల్లులు అన్నీ…. ప్రాధాన్యత క్రమంలో చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. పైకి అప్పులు, విపరీతమైన ఆర్థిక సంక్షోభం కనిపిస్తున్న…. కూడా లోపల ముందు అత్యవసరమైన వాటి చెల్లింపులు గురించి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకోవడం గమనార్హం. విత్తనాల సబ్సిడీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు వడ్డీ బకాయిలు రాష్ట్ర అభివృద్ధి కోసం ముందు ఎంతో అవసరమైన నేపథ్యంలో వాటికి సంబంధించిన అప్పులు క్లియర్ చేయడం ప్రశంసనీయం.