NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

జగన్ vs జేసీ… మధ్యలో పోలీసులు…! వాట్ ఏ గేమ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో టిడిపి నేతల అరెస్టులు కొద్ది నెలల ముందు పెద్ద సంచలనం సృష్టించాయి. అయితే నిదానంగా ఒక్కొక్కరు బెయిల్ తెచ్చుకుని బయటపడ్డారు కానీ వారు లోపల ఉన్నన్ని రోజులు మాత్రం రాష్ట్రం అట్టుడికిపోయింది. ఈ కరోనా లేకుండా ఉంటే ఒక రేంజ్ లో ఆ ప్రభావం ప్రజలపై ఉండేది. అయితే కరోనా తో సంబంధం లేకుండా అనంతపురం లో టాప్ లీడర్ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పైన పెద్ద యుద్ధానికే దిగారు. మరి దానికి బీజం ఎక్కడ పడిందో చూద్దాం….

 

ప్రశాంతంగా ఉంటే…. పంతానికి దిగారు…?

జేసీ ప్రభాకర్ రెడ్డి, అతని కొడుకు అశ్విత్ రెడ్డి ల అరెస్టు తర్వాత పెద్దన్న దివాకర్ రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అతని పాటికి అతను వ్యవసాయం పనులు చూసుకుంటూ ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా జగన్ పైన అతను చెలరేగడానికి కారణం ఏమిటంటే.. బుధవారం దివాకర్ రెడ్డికి సంబంధించిన గనులపై రైడ్స్ జరిగాయి. అనంతపురంలో దివాకర్ రెడ్డి కి చెందిన గనుల్లో సోదాలు జరగడంతో దివాకర్ రెడ్డి మైనింగ్ ఆఫీస్ ముందు ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ చివరి నిమిషంలో పోలీసుల చొరవతో వెనక్కి తగ్గారు అని తెలుస్తోంది.

డిక్టేటర్ ఆటలు సాగవట…!

ఇక అలా వెనక్కి వచ్చేసిన దివాకర్ రెడ్డి అధికారుల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పేరు తీయకుండానే.. ఒక డిక్టేటర్ ఆదేశాల మేరకు మీరంతా పనిచేస్తున్నారని కానీ అ డిక్టేటర్ కి పవర్ పోయిన తర్వాత మీ పరిస్థితి ఏమిటి ఆలోచించుకోండి అని సవాల్ విసిరారు. అంతేకాకుండా మొన్న నా తమ్ముడిని…. ఇప్పుడు నన్ను ఆ డిక్టేటర్ టార్గెట్ చేస్తున్నాడు అని పేర్కొనడం గమనార్హం. ఇదే సమయంలో పోలీసు ఆఫీసర్ లపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ ప్రాంతంలో పెద్ద దుమారాన్నే లేపాయి

మరి మీ భవిష్యత్తు ఏంటి?

మామూలుగానే దివాకర్ రెడ్డి దూకుడు గల మనిషి. ఒక మాట మాట్లాడినా…. ఒక పని చేసినా ముందు వెనక ఆలోచించడం చాలా అరుదు. అలాంటి వ్యక్తి పోలీసులకు అధికారులకు ఇప్పుడు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ రోజు నన్ను మీరు నాకు చాలా బాగా సన్మానం చేశారు…. అయితే నేను దీన్ని వడ్డీతో సహా మీకు రెట్టింపు చెల్లిస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ట్రాన్స్ఫర్ లకు భయపడి అధికారులు నా గనుల వ్యవహారాలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అని గట్టిగా హెచ్చరించారు.

ఈ ప్రభుత్వంలో ఎటువంటి చట్టాలు నియమాలు లేవు కానీ టైం వచ్చినప్పుడు తన సత్తా చూపిస్తానని దివాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టించాయి. మరి ఈ ప్రతీకార రాజకీయాల నడుమ ఎవరు తగ్గేది….? ఎవరు నెగ్గేది అన్నది తెలుసుకోవాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!