Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ నిఘా పెట్టింది.. టీడీపీలో ఉన్న నారా అనుకూల వర్గాలు అతన్ని పూర్తిగా నమ్మడం లేదు.. నందమూరి అనుకూల వర్గాలు నమ్మినా పూర్తిగా బయటపడడం లేదు.. అందుకే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో తెలుగుదేశం పార్టీ కొన్ని రోజులుగా ఆచితూచి వ్యవహరిస్తోంది. అవసరమైతే సొంత సోషల్ మీడియాల్లో అతన్ని ఆడుకోడానికి ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు.. ఈ రోజు ఒకరకంగా 24 గంటల ఉత్కంఠకు తెరపడింది. ఒకరకంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు.. టీడీపీ బెంగ, భయం పోగొట్టేసారు..
Junior NTR: 24 గంటలుగా నిఘా.. చివరికి..!
సీఎం జగన్ నుండి టాలీవుడ్ పెద్దలకు పిలుపు వచ్చింది.. నిన్న (బుధవారం) సీఎం ఆఫీస్ నుండి చిరంజీవికి ఫోన్ వెళ్ళింది.. టాలీవుడ్ నుండి పది మంది వరకు పెద్దలు వచ్చి సీఎం గారిని కలవాలనేది దాని సారాంశం. మంత్రి పేర్ని నాని కూడా చిరుతో మాట్లాడారు.. ఒక్కడే కాకుండా ఇతర హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా ఒక పది మంది వరకు రావచ్చేనేది మంత్రి చెప్పిన మాట.. అందుకే చిరంజీవితో సహా మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున, ప్రభాస్ వంటి హీరోలతో పాటూ కొరటాల శివ, రాజమౌళి, డీవీవీ దానయ్య కూడా వెళ్తారని ప్రచారం జరిగింది.. ఇది మొదలు టీడీపీలో బెంగ మొదలయింది. “జూనియర్ ఎన్టీఆర్ ఏంటి..? సీఎం జగన్ ని కలవడానికి వెళ్లడం ఏంటి..!? వెళ్తే తాత తీసేస్తాం. ఏ మాత్రం వదలాబొమ్.. సినిమా కోసం పార్టీ విధానాలు తాకట్టు పెడతారా..!? సినిమా కోసం పార్టీకి నష్టం చేసేలా వ్యవహరిస్తారా..!? బాలయ్యలా ఉండలేరా..? అంటూ టీడీపీలోనే లోలోపల చర్చ జరిగింది.. మరోవైపు జూనియర్ కూడా ఈ అంశంలో చాలా ఆలోచించారు. ఇలా 24 గంటలుగా టీడీపీ వాళ్లేమో ఎన్టీఆర్ పై నిఘా ఉంచారు. ఎన్టీఆర్ తీవ్ర ఆలోచనలో పడ్డారు.. మొత్తానికి జూనియర్ ఈరోజు రాలేదు. సీఎం తో భేటీకి ఆయన, వెంకటేష్ చివరి నిమిషంలో ఆగిపోయారు. ఇద్దరివీ పొలిటికల్ కారణాలే.. దీంతో ఆయన సొంత పార్టీ నుండి ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు. లేకపోతే ఇప్పటికే ఆయనకు టీడీపీ సోషల్ మీడియా ఒక ఆట ఆదుకునేది..!
ఎన్టీఆర్ అప్పుడు కూడా అలా..! అందుకేనేమో..?
జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులుగా టీడీపీ అనుకూల వర్గాలు.., ఆ సొంత సోషల్ మీడియా.. ఆ అనుకూల మీడియా నుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది నవంబరులో అసెంబ్లీలో నారా భువనేశ్వరి గురించి అసభ్య చర్చ జరగడం.. చంద్రబాబు దాన్ని బయటకు తీసుకొచ్చి.. మీడియా ముందు కన్నీరు కార్చడం.. దాన్ని టీడీపీ వాళ్ళు కసితీరా వాడుకొడవడం.. అటు నందమూరి కుటుంబం కూడా వైసీపీకి తమదైన స్టైల్ లో వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే.. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు టీడీపీలో ఎవ్వరికీ నచ్చలేదు. జూనియర్ ఎన్టీఆర్ వీడియో విడుదల చేసినప్పటికీ.. అందులో వల్లభనేని వంశీని, కొడాలి నానిని ఏమి అనలేదు కాబట్టి.. దాన్ని టీడీపీ వాళ్ళు లైట్ తీసుకున్నారు.., పైగా ఎన్టీఆర్ ని టార్గెట్ చేసారు. అందుకే అప్పటి నుండి ఎన్టీఆర్ అప్రమత్తమయ్యారు. వైసీపీ విషయంలో, ముఖ్యంగా ఇటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త పడుతున్నారు. ఈరోజు ఎన్టీఆర్ మాత్రం సీఎం జగన్ ని కలిసి ఉంటె టీడీపీ పెద్ద రచ్చ చేసేది.., ఎన్టీఆర్ నే దారుణంగా ట్రోల్ చేసేది.. మరోవైపు ఎన్టీఆర్ జగన్ తో జత కడుతున్న పుకారు నిజమేనేమో అనే భయం, బెంగ పెట్టుకునేది..! అందుకే ఎన్టీఆర్ ఆ బెంగ తీర్చేసారు.. 24 గంటల ఉత్కంఠకు తెర దించేశారు. తానూ సేఫ్ అయ్యారు.., టీడీపీని సేఫ్ చేసారు..!