వేరే బెంచ్ కు పంపాలన్న జస్టిస్ నారీమన్..విచారణ వాయిదా
మొన్న చీఫ్ జస్టిస్…ఇప్పుడు ఈ జస్టిస్…
మూడు రాజధానుల బిల్లు..సీఆర్డీఏ చట్టం రద్దు పైన ప్రభుత్వం చేసిన చట్టాల పైన ఏపీ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఇవ్వటంతో దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన రెండు రోజుల క్రితం చీఫ్ జస్టిస్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అయితే, సుప్రీం ప్రధాన న్యాయమూర్తి కుమార్తె అమరావతి రైతుల తరపున వాదిస్తుండటంతో..ప్రధాన న్యాయమూర్తి ఆ కేసును నాట్ బిఫోర్ మీ అంటూ మరో బెంచ్ కు బదిలీ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఈ కేసు ఈరోజు జస్టిస్ నారీమన్ బెంచ్ మీదకు వచ్చింది. అయితే, ప్రభుత్వ అప్పీల్ కు వ్యతిరేకంగా అమరావతి పరిరక్షణ సమితి పిటీషన్ దాఖలు చేసింది. రైతుల తరపున జస్టిస్ నారీమన్ తండ్రి హాజరయ్యారు. దీంతో..నారీమన్ ఈ కేసును మరో బెంచ్ కు వాయిదా వేయాలంటూ నాట్ భిపోర్ మీ అంటూ కేసును వాయిదా వేసారు. ఒకే కేసులో సుప్రీంలో వరుసగా రెండో సారి ఈ విధంగా జరగటం అరుదైన విషయంగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో..ప్రభుత్వం సుప్రీంలో దాఖలు చేసిన పిటీషన్ పైన మరో బెంచ్ వద్ద విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే హైకోర్టు ప్రభుత్వం చేసిన చట్టాల పైన ఈ నెల 27వ తేదీ వరకు స్టేటస్ కో అమలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వం రాజధాని బిల్లులకు గవర్నర ఆమోదంతో చట్టాలుగా మారుస్తూ గజెట్ విడుదల చేసింది. దీని పైన రైతులు హైకోర్టులో ఈ చట్టాల అమలు నిలిపివేయాలంటూ పిటీషన్ దాఖలు చేసారు. దీనిని విచారించిన త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వాన్ని కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సూచిస్తూ తొలుత ఈ నెల 14వ తేదీ వరకు ఆ చట్టాలు అమలు కాకుండా స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఆ పిటీషన్ కు సమాధానంగా కేంద్రం..రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసాయి. కాగా, తిరిగి 14న ఈ పిటీషన్ తో పాటుగా రాజధాని అంశం పైన దాఖలైన పిటీషన్ల పైన విచారణ చేసిన హైకోర్టు ఈ నెల 27వ తేదీ వరకు స్టేటస్ కో ను కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సమయంలో సుప్రీంలో రెండు సార్లు ప్రభుత్వ పిటీషన్ విచారణకు వచ్చే సమయంలో మొన్న ప్రధాన న్యాయమూర్తి..ఇప్పుడు జస్టిస్ నారీమన్ నాట్ బి ఫోర్ మీ అంటూ తప్పుకోగా..ఇప్పుడు ఈ కేసు మరో బెంచ్ కు బదిలీ అవ్వాల్సి ఉంది. ఆ తరువాతే విచారణ జరగనుంది.