Kanaka Durga Temple : ఏపీలో ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉంటుంది.. ప్రభుత్వం ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో తలదూర్చుతుంది.. ప్రతిపక్షం ప్రీతీదానిలో దూరుతూ విషయాన్నీ కెలుకుతుంది..! హిందూ దేవాలయాల విగ్రహాల ధ్వంసం.., టీటీడీ డిక్లరేషన్ అంశాలతో ఇప్పటికే సీఎం జగన్ “హిందూ మనోభావాలు” అనే ఒక సున్నిత వ్యవహారంలో కేంద్ర బిందువయ్యారు. వాటి నుండి ఎలాగోలా తప్పుకొచ్చారు. తన మార్క్ పరిష్కారాలతో తనను చుట్టుకోకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. అదే విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అవినీతి వ్యవహారం..! గమ్మత్తు ఏమిటంటే… ఈ వ్యవహారాన్ని బయట పెట్టింది ప్రభుత్వమే.., ఈ వ్యవహారంతో ఇరుకున పడింది ప్రభుత్వమే..!!
Kanaka Durga Temple : గుడి ఎనకా నా సామి ఎవరు..!?
గుడి అంటే చాల తతంగాలు ఉంటాయి. హుండీలు, నిధులు, సెక్యూరిటీ, సిబ్బంది నియామకాలు, ఉత్సవాలు, నిర్వహణ ఖర్చులు… ఇలా అనేక తతంగాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏపీలో తిరుమల తర్వాత ఆ స్థాయిలో పెద్ద గుడి విజయవాడ కనకదుర్గమ్మ గుడి. ఈ గుడిలో అవినీతి బయటపడుతుండడం.. దీనిలో కొందరు పెద్దలు తలదూర్చారని బయటకు వస్తుండడం.. ఆ పెద్దని ప్రభుత్వ పెద్ద ఒకరు కాపాడుతున్నారని బలమైన ఆరోపణలు వస్తుండడం వైసీపీ ప్రభుత్వానికి ఒక తలనొప్పే. ఈ మొత్తం వ్యవహారంలో కీలక అంశాలు దారి తప్పుతున్నట్టు గుర్తించవచ్చు..!!
* అమ్మవారి ఆలయంలో అవినీతి ఇప్పటిది కాదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి కొనసాగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా భారీగానే మొదలయింది. కొండపై మూడేళ్ళుగా అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సుమారుగా రూ. 70 కోట్లు ఖర్చు చేశారు. దీనిలో నిబంధనలకు విరుద్ధంగా.. అధికారుల అనుయాయులకు కట్టబెట్టిన పనులే ఎక్కువ ఉన్నాయి.
* ఇక్కడ రాజకీయ అవినీతి కంటే.. అధికారిక అవినీతి ఎక్కువ పేరుకుపోయింది. అంటే… రెండు దశాబ్దాలకు పైగా ఇక్కడే తిష్ట వేసిన సీనియర్ ఉద్యోగులు పాలకవర్గానికి తెలియకుండానే… రూ. కోట్లు నొక్కేస్తూ వస్తున్నారు. కొందరు బదిలీ జరిగినా… డిప్యుటేషన్ పై అక్కడకు వచ్చేస్తున్నారు.
* ఇటీవల రీసెంట్ గా … ఆలయ సెక్యూరిటీని మాక్స్ సంస్థకి అప్పగించారు. ఆ సంస్థ అర్హత లేనప్పటికీ… రూ. కోట్ల విలువైన టెండర్ ని ఆ సంస్థకి ఇచ్చేసారు. దీనిపై అనేక అనుమానాలున్నాయి. గమ్మత్తేమిటంటే… గతంలో ఈ ఆలయ సెక్యూరిటీ చూసిన ఓపీడీస్ఎస్ సంస్థని బ్లాక్ లిస్టులో పెట్టారు. మళ్ళీ ఆ సంస్థలోని వ్యక్తులే మాక్స్ పేరిట ఒక సెక్యూరిటీ సంస్థని నెలకొల్పితే… ఎటువంటి అర్హత లేకపోయినప్పటికీ వారికి టెండర్ దక్కేలా ఆర్డర్ ఇచ్చేసారు. రూ. 2 కోట్లు విలువ చేసే చెత్తని రూ. 42 లక్షలకు కట్టబెట్టారు. గడిచిన మూడేళ్ళ వ్యవధిలో జరిగిన అవినీతి తతంగం మొత్తం ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తుంది.
ఈఓకి ఉంది భాగం..! మంత్రికీ ఉంది గండం..!!
ఇంగినీరింగ్ పనులు.. సెక్యూరిటీ టెండర్లు.. చెత్త అమ్మకాలు.. పనుల కాంట్రాక్టులు అనుయాయులకు, అయినా వారికి ఇచ్చేసారు అంటే కేవలం ఉద్యోగుల పాత్ర మాత్రమే కాదు. దీనిలో ఈవోకి తెలియకుండా ఏమి జరిగే అవకాశమే లేదు. టెండర్లలో మార్పులు, అక్రమాలు ఆయనకు తెలియకుండా జరగవు. మొత్తం నడిపించేది ఆయన. ఆయనను నడిపించేది దేవాదాయ శాఖ మంత్రి..! ఈవోగా సురేష్ బాబుని అక్కడ వేయించింది మంత్రి వెల్లంపల్లి… మంత్రి ఆశీస్సులతోనే సురేష్ బాబు అక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే టాక్ ఉంది. పైగా కొన్ని ఆధారాలతో ఈవో కూడా దొరికిపోయారు. అందుకే ఆయనపై బదిలీ వేటు పడింది. ఇక్కడైతే ఈ వ్యవహారం ఆగదు. మంత్రి గారికీ కొంత ప్రభావం ఉంటుంది..!! ఆయన ఎంత వరకు నియంత్రించగలరు..? ఆయన పాత్ర ఏమిటి..? అనేది తేలితే ఆయన భవిష్యత్తు తేలినట్టే..!!