బాలీవుడ్ లో నేరాలు.., ఘోరాలు.., సీకటి సిత్రాలు.., మాఫియాలు.., బాగోతాలు ఎన్నో ఉంటాయి..! వాటిపై చాలా కాలంగా సమయానుగునా “రాజీ” యుద్ధం జరుగుతుంది..!! ఏమో, ఇకపై ఈ యుద్ధం క్లైమాక్స్ కి చేరిందేమో. తాజా సుశాంత్ మరణం సహా.., నార్కోటిక్స్ కేసు.., వారసత్వ పోరు.., మీ టూ.. ఇవన్నీ బాలీవుడ్ లో పాతుకుపోయాయి. దశాబ్దాల తరబడి ఉన్నవే. ఇక ముంబైలో డ్రగ్స్ మాఫియా, నార్కోటిక్స్ మాఫియా, భూ కబ్జాలు, బెదిరింపులు, స్మగ్లింగులు అన్నీ ఉండేవే. వీటిలో కొన్నిటిని కంగనా టార్గెట్ చేసింది. బాలీవుడ్ లో చీకటి అంశాలపై ఆమె తరచూ మాట్లాడుతూనే ఉంటుంది. మొదటి నుండీ ఆమె ప్రత్యేకం.., అందుకే ప్రతిభ బోలెడు ఉన్నా సినిమాలు తక్కువ ఉంటాయి. ఇక తాజాగా శివసేన ప్రభుత్వం, పోలీసులు, ఈ పార్టీకి మీడియా అధినేతతో కూడా పెట్టుకుంది. పోరుకి సై అంటుంది. సవాళ్లు చేస్తుంది. తేల్చుకుందాం రా అంటుంది..!!
అన్ని వ్యవస్థలతో పోరు షురూ..!!
మహారాష్ట్రలో అందులోకి ముంబైలో ఎంతటి పెద్దోళ్ళు అయినా మూసుకుని ఉండాల్సిందే. సచిన్ కావచ్చు, బిగ్ బీ కావచ్చు.. ముంబైలో ఉండాలంటే చీకటిని చూడకూడదు. అందుకే వాళ్ళు తమ పంథాలో ఉంటారు. అటువంటిది కంగనా కడిగేస్తుంది. శివసేన ప్రభుత్వాన్ని, బాలీవుడ్లో నార్కోటిక్ నీ, చీకటి వ్యవహారాన్ని కడిగేసి ఛాలెంజ్ చేస్తుంది. విమర్శలు గుప్పిస్తుంది. ఇది తట్టుకోలేని శివసేన ప్రభుత్వం సహా… ఆ పార్టీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు, ఆ రాష్ట్ర అధికారులు, కొందరు పోలీసులు కూడా కంగనాకు వ్యతికరేకంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వీటిపై కంగనా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఆమె మాట్లాడేది మొత్తం బాలీవుడ్ లో చీకటి వ్యవహారాలు, నార్కోటిక్స్ కేసుల గురించే. దానిలో భాగంగా పోలీసుల సహా.., అన్ని వ్యవస్థలను ఘాటుగా విమర్శిస్తోంది.
సామ్నా అధినేతతో తేల్చుకుందాం రా అంటూ సై…!!
సామ్నా పత్రిక అందరికీ తెలిసే ఉంటుంది. శివసేన పార్టీకి ఆత్మ, పరమాత్మ అన్ని ఆ పత్రికే. అటువంటి పత్రిక అధినేత సంజయ్ రౌత్. ఈయనకు కంగాణపై వీరావేశం వచ్చింది. పోలీసులనే విమర్శిస్తావా..? శివసేననే అంటావా..? ముంబై ఎలా వస్తావో చూస్తాను..! ముంబై వచ్చి ఎలా తిరిగి వెళ్తావో చూస్తాను..! ముంబై రాకు, వచ్చావా అంతే సంగతులు అంటూ నేరుగా బెదిరించాడు. ప్రస్తుతం మనాలీలో ఉన్న కంగనా కూడా దీనిపై ఘాటుగా స్పందించింది. “ముంబై ఏమైనా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరా..?? నేను వస్తున్నాను. ఫలానా రోజున, ఫలానా చోటకు వస్తాను. రా” అంటూ ప్రతి సవాల్ చేసింది.
ఇలా ముంబైలో పోలీసులు, మాఫియాలు, నాయకులు, మీడియా అధినేతలు, ప్రభుత్వాధినేత ఏ ఒక్కరినీ కంగనా వదలడం లేదు. తనకు బీజేపీ లేదా, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటె ముంబైలో మరిన్ని సంచలనాలు బయటకు తీసుకువస్తానని అంటుంది. అందుకే ఆమె మొండిధైర్యానికి మాత్రం దాసోహమే. ఇక బీజేపీకి ఎలాగూ సంకేతం ఇచ్చింది కాబట్టి…, నేరుగానే, పరోక్షంగానో… వెళ్ళినట్టేగా…!! బీజేపీకి ముంబైలో ఇప్పుడు పట్టు కావాలి. ఈమె రూపంలో అది దొరికి ఉండొచ్చు.!!