కొద్ది రోజుల క్రితం ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. కొంతమంది ఆయన కోమాలోకి వెళ్లారని…. మరికొంత మంది చనిపోయారని కూడా చెప్పారు. తీరా చూస్తే ఆయన అన్నిటి నుండి బయటపడి ఆయురారోగ్యాలతో హుందాగా తిరుగుతూ కనిపించారు .ఇప్పుడు మళ్ళి కిమ్ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర కొరియాలో గత కొన్ని నెలలుగా ఈ ప్రచారం ఎందుకు సాగుతోంది? అసలు అధికారుల సమావేశంలో బయటికి వస్తున్న వీడియోలు ఏవి?
తిరుగుబాటు అణిచివేసేందుకే?
ముందుగా ఈ రచ్చ మొదలైంది ఎప్పుడంటే కిమ్ స్థానంలో ఆయన సోదరి కిమ్ యో జోంగ్ త్వరలోనే ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టనున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కిమ్ ఒక నియంత. ఆయన మరణాన్ని బయటపెడితే దేశంలో తిరుగుబాటు వస్తుందని ఏకైక కారణంతో ఇప్పుడు బయటకు తెలియని ఇవ్వడం లేదని అంటున్నారు. ప్రజలకు కిమ్ మరణంపై తప్పుడు సమాచారాన్ని ఇప్పటికే ఇస్తున్నారని పేర్కొంటున్నారు. కిమ్ తండ్రి మరణించినప్పుడు కూడా ఇలాగే నెలల తర్వాతనే అధికారికంగా ప్రకటించిన విషయాన్ని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు
బాగుంటే ఇంత ఉండేదా?
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉత్తర కొరియాలో కిమ్ పాలనకి సెలవు చెప్పే రోజులు మొదలయ్యాయి అని అంటున్నారు. అతనికి ఉన్న విపరీతమైన బుద్ధి ప్రతి ఒక్కరిని బాధిస్తుండడంతో అతను కూడా బయట పెద్దగా తిరగట్లేదని అంటున్నారు. ఆయనకు అణ్వాయుధాలను పరిశీలించడం ఒక పిచ్చి. వాటిని పరిశీలిస్తూ ఫోటోలు దిగి ప్రపంచాన్ని బెదిరించే వారు. అయితే దాదాపు నెల నుండి అతని జాడ లేకుండా పోయింది. అతను ఆరోగ్యంగా ఉండి ఉంటే అనేక సందర్భాల్లో బయటకు వచ్చే వారిని అర్థం అవుతోంది. విడుదలైన ఫోటోలు కూడా పాతవి అని కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. మొత్తానికి కిమ్ ఆరోగ్యంపట్ల ఏదో తేడా ఉందని మాట
ఆమెదే పెత్తనమంతా…
ఇదంతా పక్కన పెడితే కొత్తగా తెర మీదకి వస్తున్న వాదన ఏమిటంటే ప్రస్తుతం ఉత్తర కొరియాలో పాలన అంతా కిమ్ సోదరి యో జొంగ్ చూసుకుంటుందట. జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాల నిర్ణయాలు సైతం ఆమే తీసుకుంటుందని చెబుతున్నారు. ఇక అంతే కాకుండా ఆ దేశ అధ్యక్ష పదవిని ఆమే త్వరలోనే చేపడతారని వార్తలు వస్తున్నాయి. తన సోదరుడిని ఆమె అదుపులో పెట్టుకున్న ఆమెకు కిమ్ కు మించిన నిరంకుశత్వం ఆమె సొంతం అని ఉత్తరకొరియా మీడియా వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా కూడా అధ్యక్షురాలిగా సోదరి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అతని మరణ బయటకు వస్తుందని అంటున్నాయి. ఏప్రిల్ 11వ తేదీన చివరిసారిగా పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ పాల్గొన్నారు. అప్పటినుండి ఆయన కోమా లో ఉన్నారా లేక ఏకంగా మరణించారు అన్న విషయం ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది.