Krishnapatnam Aanandayya: మూడు రోజుల నుండి దేశం మొత్తం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామాన్ని చూస్తుంది.. కరోనాకి ఆయుర్వేద మందుని స్వయంగా తయారు చేసి ఉచితంగా అందిస్తున్న ఆనందయ్య పేరు మార్మోగిపోయింది.. విషయం సోషల్ మీడియాలో మార్మోగిపోయింది.. వెరసి ఆయనపై ప్రభుత్వం కన్ను వేసింది.. బృందం వెళ్లి పరీక్షించింది.. అనుమతులిచ్చింది.. అధికారికంగానే మందు పంపిణీకి అనుమతులిచ్చింది.. వెరసి ఆనందయ్య ఒక హీరో.. ఒక వైద్యుడు.. ఒక దేవుడు కూడా… అదే ఆనందయ్యపై ఇంకా కొన్ని అనుమానాలున్నాయి. ఇంకా కొన్ని పరీక్షలు అతను ఎదుర్కోవాల్సి ఉంది. అందుకే ఓ చిన్న పరీక్ష…
Krishnapatnam Aanandayya: అమ్మో.. కాసుల వేట ఆగిపోతే..!?
ఆయన మందు వాడితే సైడ్ ఎఫెక్టుల్లేవ్.. “వెరీగుడ్”.. పావలా ఖర్చూ లేకుండానే ప్రాణాపాయ రోగం తగ్గిపోతుంది.. వెరీవెరీ గుడ్.. అందుకే నిన్న అర్ధరాత్రి నూనె నెల్లూరు జీజీహెచ్ లో కొవిడ్ బాధితుల బ్లాక్ మొత్తం కృష్ణపట్నం వెళ్లిపోయింది. అతనిపై అంతగా నమ్మకం ఏర్పడింది. నెల్లూరులో కార్పొరేట్ దోపిడీ సగానికి పడిపోయింది. అందుకే ఇప్పుడు కార్పొరేట్ చూస్తూ ఊరుకోదు. తమకు కాసులు కురిపిస్తున్న రోగానికి ఉచితంగా వైద్యం చేస్తాం.. మందులు ఇస్తాం అంటే కార్పొరేట్ పునాదులు ఏమవ్వాలి..!? వారిస్తున్న కమీషన్లతో నెట్టుకొస్తున్న అధికారులు ఏమవ్వాలి..!? వారి ఊపిరితో అక్రమ వ్యాపారం చేస్తున్న రాజకీయం ఏమవ్వాలి..!? అందుకే ఈ “ఆయుర్వేదం” కార్పొరేట్ దోపిడీకి విసిగివేసారిన ఆక్రోశం.. చివరికి నిన్నటితో ప్రభుత్వమూ గ్రీన్ మార్క్ వేసింది.. కానీ ఇంకా కొన్ని అనుమానాలే..!
పొద్దున్న అయ్యే సరికి ఆ ఊళ్ళో గుంపులూ, గుంజాటనలు, లైన్లు, బాభత్సకాండ మొదలయింది. వందల్లో వాహనాలు, వేళల్లో బాధితులు.. పోలీసులు కూడా అదుపు చేయలేని పరిస్థితి.. అందుకే ఈ లోగా కొన్ని పరీక్షలు చేయొచ్చు. “ఈ అనుమానాలు తీరేలా.., ఇంకా లోతుగా పరీక్షలు చేసేలా.., నెల్లూరు జీజీహెచ్ లో ఐసీయూలో ఉన్న కొవిడ్ పేషేంట్లకి ఆనందయ్య గారితో వైద్యం చేయించండి.. వాళ్లంతా వారం రోజుల్లోపు కోలుకుంటే ఇక కొవిడ్ ఖాతాలు క్లోజ్ చేసేయొచ్చు.. ఆయుర్వేద కంపెనీలు అన్నిటికీ ఈ ఫార్ములా ఇచ్చి మందుని తయారు చేయించవచ్చు. కార్పొరేట్ దోపిడీని మూసేయొచ్చు.. ఆనందయ్యకు అవార్డులతో సత్కరించవచ్చు.. ఏమంటారు..!?