తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ మరియు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం నారా లోకేష్ గారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్టిక్కర్ ఉన్న కారులో ఐదు కోట్ల రూపాయలు చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకోగానే తెగ రెచ్చిపోయారు. సూట్ కేసు కంపెనీల ద్వారా రాష్ట్రంలో వైసిపి అవినీతితో డబ్బు సంపాదించి ఇలా పంపిస్తుందని అన్నారు. అంతా హవాలా మయం అని కూడా అనేశారు. డబ్బు ఏకంగా మారిషస్ చేరుతుంది అని జాతకం చెప్పేశారు. ఇదంతా విని మొదట్లో టిడిపి అభిమానులు సంబరపడ్డారు వైసిపి మద్దతుదారులు ఆలోచనలో పడ్డారు…. కానీ చివరికి సీన్ రివర్స్ కావడానికి పెద్ద సమయం పట్టలేదు.
స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లో చదివిన లోకేష్ కు ఇది తెలియదా..?
మన ఏపీ మాజీ మంత్రి లోకేష్ గారి విద్యాభ్యాసం విదేశాల్లో జరిగిన విషయం తెలిసిందే అయితే ఆయన మాట్లాడే మాటలు, వేసే ట్వీట్లు చూస్తుంటే ఇదంతా నిజమేనా..? అని అందరికీ డౌట్లు వస్తుంటాయి. అసలు సూట్కేస్ కంపెనీలు నిజమే అయితే బాలినేని గాని ,వైఎస్ భారతి గాని, వైఎస్ అనిల్ రెడ్డి గాని ఎవరైనా కానీ డైరెక్టర్లు గాఒరిజినల్ పేర్లు పెట్టుకుంటారా? సూట్కేస్ కంపెనీలు నేది బినామీల పేర్ల మీద క్రియేట్ చేసి అక్రమ లావాదేవీలకు ఉపయోగించేవి. వాటికి ఎవరూ తమ సొంత ఆస్తులుగా చూపించుకోరు సామి అని వైసీపీ వాదన. ‘సూట్కేసు’ అనే పదానికి పర్యాయపదం లాగా నిలిచే విజయసాయిరెడ్డి ఇదే మాటను చెప్పి మొత్తుకుంటున్నారు. ఇక సూట్ కేసులు, కంపెనీల గురించి విజయసాయిరెడ్డి కన్నా బాగా ఎవరికి తెలుసు..? అయినా నిజంగా ఎవరూ కూడా సూట్కేస్ కంపెనీలు గా చెప్పబడే వాటికి రియల్ డైరెక్టర్లు గా ఉండరు. ఈ మాత్రం మన లోకేష్ కు తెలియదా?
జగన్ ఏమిటి…. ఐదు కోట్ల ఏమిటి? లాజిక్ ఉండాలి కదా..!
జగన్ ప్రభుత్వం వచ్చాక ఈ అక్రమ లావాదేవీలు, హవాలాలు, సూట్కేస్ కంపెనీలు ఈజీ అయిపోయాయని లోకేష్ అన్నారు. అసలు నిజంగా రాజకీయం తెలిసినవారు ఎవరైనా మాట్లాడతారా అని రాజకీయ విశ్లేషకులు తో పాటు ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. హవాలా రూపంలో ఎవరైనా నల్లధనాన్ని నగదుగా పంపిస్తారా? నగదుగా తరలిస్తుంటే అది హవాలా ఎలా అవుతుంది? ఇక ముఖ్యమంత్రి లేదా ఒక మంత్రి చెన్నై వరకు ఆఫ్ట్రాల్ 5 కోట్ల నగదు విజయవంతంగా పంపించలేని పరిస్థితిలో ఉన్నారా..? అసలు ఒక మంత్రి ఫోటో ఉన్న కారు ని అంత ధైర్యంగా లేదా రిస్క్ గా డబ్బుతో ఎలా తరలిస్తారు? ఇక సీఎం తలచుకుంటే చెన్నైలో 5 కోట్లు అడ్జస్ట్ చేయలేడా…. తాడేపల్లి నుండి అక్కడి వరకు పంపించాలా? అసలు నిజంగా జగన్ ఇలా పంపించి ఉంటే ఐదు కోట్ల రూపాయలు దొరకకుండా మేనేజ్ చేయలేరా..? లోకేషానికి ఆవేశం ఎక్కువైపోతింది…. లాజిక్ లేకుండా ఛాన్స్ దొరికింది కదా అని తీవ్ర ఆరోపణలు చేయడం సబబుగా లేదు అన్నది వారి వాదన.
అదీ నీ మాటే… ఇదీ నీ మాటే….
ముందేమో వైసీపీ ప్రభుత్వం హవాలా ద్వారా మారిషస్ కు ఇలా డబ్బులు పంపిస్తుంది అంటారు. ఆ తర్వాత ఏమో చెన్నైలో 60000 అడుగుల సొంత ఇల్లు జగన్ కట్టుకుంటున్నాడు అని అంటారు. ఆ డబ్బే మొదటి విదేశాలకు అంటారు…. తర్వాత ఇల్లు కట్టుకోవడానికి అంటారు…. తర్వాత బాలినేని జగన్ మంత్రివర్గంలో సభ్యుడు…. ఆ డబ్బు పోతున్నది చెన్నైకి ఇక ఆ డబ్బు నలుపు కావచ్చు-తెలుపు వచ్చు అది మాత్రం కచ్చితంగా జగన్ కొత్త ఇంటికి పోతున్నట్లు భలే కథలు చెప్తారు. ఇక మరి సంగతి ఏమిటి అంటే ఐదు కోట్లు పంపిస్తే మిగతా డబ్బు జగన్ ఇంటికి చేరేది ఎంత…? అంటే ఈ బోలెడు డబ్బులో సగం విదేశాలకు సగం జగన్ కొత్త ఇంటికి సగం వెళ్తుందా..? ఏదో ఒక్కటే క్లారిటీ ఇవ్వాలి కానీ రెండు మాటలు మాట్లాడటం ఏమాత్రం బాగోలేదని జనాలు నవ్వుకుంటున్నారు.