Mekapati Goutham Reddy: ఒక్క మరణం రాష్ట్రాన్ని నిశ్శబ్దం చేసింది.. ఒక్క మరణం రాష్ట్ర రాజకీయాన్ని నివురు గప్పింది.. ఒక్క మరణం రాష్ట్రంలో నేతలకు మౌనం నేర్పింది.. ఒక్క మరణం ఎందరో నేతలకు, ఎందరో పెద్దలకు పాఠంగా మారింది.. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి(Mekapati Goutham Reddy) విషయంలో అసలేం జరిగింది..!? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఫిట్ గా ఉంటూ.. కండలు తిరిగిన వీరుడుగా.., ఆరడుగుల ఆజానుబాహుడిగా.., నిత్యం హుషారుగా.. వివాద రహితంగా ఉండే మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా ఎలా మరణించారు..!? దుబాయ్ బిజినెస్ ఎక్స్పో లో పాల్గొని.. నిన్న వచ్చి.. రాత్రి ఒక పెళ్లి వేడుకలో పాల్గొని.. మళ్ళీ ఉదయాన్నే జిమ్ కి వెళ్తుండగా ఏం జరిగింది..!? మంత్రి మరణానికి ముందు చివరి 90 నిమిషాల అప్డేట్ ఇది..!!
Mekapati Goutham Reddy: కాస్త ఆలస్యంగా లేచారు.. కానీ..!
గౌతమ్ రెడ్డి ప్రతీరోజు 5.30 గంటలకే నిద్ర లేస్తారు. లేచిన వెంటనే కాఫీ తాగి వ్యాయామానికి వెళ్తారు. కానీ ఈ రోజు మాత్రం గౌతమ్ కాఫీ తాగలేదు. రాత్రి నిద్రం పోవడం ఆలస్యం కావడంతో ఈరోజు ఆలస్యంగా నిద్ర లేచారు. అనంతరం జిమ్ కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా.., అలసటగా.., ఛాతి నొప్పిగా ఉండడంతో ఈరోజు ఉదయం 7. 20కి ఇంట్లోనే సోఫాలో వచ్చి కూర్చుని.. వెంటనే రెండు నిమిషాల్లోనే అక్కడే కుప్పకూలిపోయారు. చెమటలు పట్టడం గుర్తించిన కుటుంబ సభ్యులు ప్రాథమిక వైద్యం అందించి, వైద్యులకు ఫోన్ చేసి.. వారి సూచనతో ఆయన్ను అపోలోకి చేర్చారు. ఆ తర్వాత డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందించారు. కానీ అవేవీ ఫలించలేదు. సరిగ్గా సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు చికిత్స అందించిన అపోలో వైద్యులు ధృవీకరించారు. ఇంట్లో పని మనిషి ఇచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే..
కాగా.. ఉదయం 7:30 గంటలకు జిమ్కు వెళ్దామని సిద్ధమయ్యారని.. కానీ ఛతోయ్ నొప్పితో అక్కడే పడిపోయారని తెలుస్తుంది.. 7 గంటలకు నిద్ర లేచారు.. జిమ్ కి వెళ్ళడానికి సిద్ధమవుతూ.. అలసటతో 7.20 గంటల సమయంలో సోఫాలో కూర్చున్నారు. పనిమనిషి కాఫీ ఇచ్చినా వద్దని చెప్పి.. ఛాతి నొప్పిగా ఉండి , ఒళ్ళంతా చెమటలు పట్టడంతో గుండెను గట్టిగా పట్టుకుని అక్కడే కూర్చుండిపోయారు. వెంటనే గౌతమ్ ని గుర్తించిన పని మనుషుల, కుటుంబ సభ్యులు తమకు తెలిసిన వైద్యులకు ఫోన్ చేయగా.. గుండెపోటు వచ్చిందని గుర్తించి.. ఆసుపత్రికి తరలించారు. 7.34 కి ఇంటి నుండి బయల్దేరి.. 7.48 సమయానికి అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. సరిగ్గా 8.55 సమయంలో గౌతమ్ రెడ్డి మరణించినట్టు ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారు. దాదాపు 75 నిమిషాల పాటూ ఆసుపత్రిలో ఆయనకు CPR చికిత్స చేసారు. ఇద్దరు కార్డియాలజిస్టులు చేరుకొని.. వైద్యం అందించే ప్రయత్నం చేసారు. అప్పటికీ బాడీ రెస్పాండ్ కాలేదు. ఇక ఆఖరి ప్రయత్నాలు ఫలించకపోవడంతో 9గంటల ప్రాంతంలో ఆయన చనిపోయిటన్లు ధృవీకరించారు. ఆయన మరణంపై అపోలో వైద్యులు కీలక ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం 9.16 గంటలకు గౌతమ్రెడ్డి మృతిచెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ‘గౌతమ్రెడ్డి ఇంటి దగ్గర కుప్పకూలారు. ఉదయం 7.45 గంటలకు గౌతమ్రెడ్డిని అపోలో ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్పందించని స్థితిలో గౌతమ్రెడ్డిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆయన ఆస్పత్రికి వచ్చే సమయానికి శ్వాస ఆడట్లేదు. అత్యవసరం విభాగంలో తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది’ అని వైద్యులు ప్రకటించారు..!
పునీత్ రాజ్ కుమార్ కూడా..!!
గౌతమ్ రెడ్డి ఫిట్ గా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. నిత్యం జిమ్ లో కనీసం 45 నిమిషాలు గడుపుతారు.. ఎక్కడ ఉన్నా జిమ్ లో వ్యాయామం చేయడం ఆయనకు అలవాటు. అందుకే ఆయన శరీర సౌష్టవం కూడా అలాగే ఉంటుంది. చూసిన వెంటనే జిమ్ బాడీలా కనిపిస్తుంది. ఇదే కోవలోకి.. ఇదే వయసున్న కన్నడ హీరో దివంగత పునీత్ రాజ్ కుమార్ కూడా వస్తారు. ఈయన కూడా నిత్యం జిమ్ చేస్తారు. ఫిట్ గా ఉంటారు. గత ఏడాది అక్టోబర్ 29న ఉదయాన్నే జిమ్ చేస్తూ.. జిమ్ లోనే గుండెపోటుకు గురై మరణించారు. అదే సమయం.. అదే వయసు.. అదే తరహా అలవాటు.. అదే తరహా మరణం.. ఇప్పుడు ఫిట్నెస్ వర్గాలను కూడా ఆందోళనలోకి నెట్టేస్తుంది. కొత్త కలవరం సృష్టిస్తుంది..!