భారత దేశ రాజకీయాల్లో గత కొంత కాలంగా రాజకీయ నాయకులంతా జమిలి జపం చేస్తున్నారు మోడీ సర్కార్ ఎన్నికలపై సీరియస్ గా ఉండటమే అందుకు కారణం. 2022లో జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పలు పార్టీలు సూచిస్తున్నాయి. ఇక ఢిల్లీ పెద్దలు అందరూ జమిలి ఎన్నికల నిర్వహణపై డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. దీంతో వరుసపెట్టి ఊహాగానాలు మొదలయ్యాయి అంతేకాకుండా లా కమిషన్ కూడా ఈ ప్రక్రియకు ఒకే అనడంతో ప్రాంతీయ పార్టీలన్నీ దీనిని సీరియస్ గా తీసుకున్నాయి. ఇక ఎన్నికల లా కమిషన్ రాజ్యాంగంలో సమాఖ్య స్ఫూర్తి లోపించిందని వాదించింది. కొన్ని రాష్ట్రాలు జమిలి ఎన్నికలకు దూరంగా… విముఖంగా ఉన్నాయి అసలు ఆ ఎన్నికలే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని వాదిస్తున్నాయి.
ప్రధాని మోడీ మాత్రం ఈ వ్యాఖ్యలు అన్నింటికీ వరుసబెట్టి చెక్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న మోదీ ఏ క్షణంలోనైనా జమిలి ఎన్నికలకు పదండి అనవచ్చు అన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ అంతా అలెర్ట్ అయిపోయి ఉన్నారు. ఆఖరికి ఏ మాత్రం పటిష్టంగా లేని పార్టీలు కూడా ఎన్నికలకు సిద్ధం కావాలని పిలునిస్తున్నాయి. అయితే ఇటీవల కొన్ని చట్టాలు రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ముఖ్యంగా వ్యవసాయ శాఖ బిల్లులో ఈ సంప్రదింపులకు విఘాతం కలిగింది అని కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇక జమిలి ఎన్నికల విషయంలో కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి తోడు కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్రానికి దాసోహం అంటున్నారని అంటున్నారు. అంతేకాకుండా కేంద్రం ముఖ్యమంత్రులను ఈడి, ఐటీ సోదాలు పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తుంది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. మొత్తానికి మోదీ అనుకుంటే జమిలి ఎన్నికలు జరగడం పెద్ద విషయం కాదని… కేంద్రం తమ స్వలాభాలు చూసుకొని ఆ విధంగా అడుగులు వేస్తే కచ్చితంగా అది జరుగుతుంది అని అంటున్నారు. అందుకే అందరూ వీటిని సీరియస్గా తీసుకున్నారు అని చెప్పాలి.