కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం అనేక గణంకాలు వస్తుంటాయి. వారి పాలనను తెలిపే నెంబర్లను బడా నాయకులు చాలా సీరియస్ గా తీసుకుంటారు ముఖ్యంగా బిజెపి లాంటి పార్టీకి ఇది చాలా అవసరం…
ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు…
భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. అప్పుడు నోట్ల రద్దు దగ్గర నుండి మొన్నటి వ్యవసాయ చట్టాల వరకు వారు తీసుకున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఇలాంటి సమయంలో దేశ ఆర్థిక పరిస్థితి పై పెనుభారం పడింది. సరిగ్గా ఎంతోమంది చేతగాని ప్రభుత్వం అని విమర్శిస్తున్న సమయంలో లో ఒక రిపోర్టు బిజెపి ప్రభుత్వాన్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తోంది.
వారిని మించిపోయారు
వివరాల్లోకి వెళితే మోడీ ప్రధానిగా కొనసాగుతున్న సమయంలో దాదాపు 8 లక్షల కోట్ల నిరర్ధక అప్పులను వివిధ బ్యాంకులు మాఫీ చేశాయి. ఇదంతా కేవలం నాలుగు సంవత్సరాల వ్యవధిలో జరిగింది. అయితే యూపీఏ ప్రభుత్వం పాలించిన పది సంవత్సరాల తో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. మహారాష్ట్రలోని పూణేకు చెందిన ఒక వ్యాపారవేత్త నిరర్థక అప్పుల పై సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న దరఖాస్తు ద్వారా ఈ విషయం బయటపడింది.
లాభం కన్నా నష్టమే ఎక్కువ…?
ఇక మోడీ హయాంలో 2015-19 మధ్య కాలంలో రూ 794354 అప్పులను నిరర్ధక పద్దుల కింద గుర్తించారు. ఇక పదేళ్ల యూపీఏ లో రెండు లక్షల 20 వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల బకాయిలను సదరు బ్యాంకులు మాఫీ చేశారు అని తెలిపారు. ఇక మోడీ హయాంలో ఎక్కువ అప్పులు మాఫీ అయ్యాయని లబ్ధిదారులు ఆనందపడతారు అని ఒక పక్క అనుకుంటే వారికి మాఫీ చేసిన అప్పుల కారణంగా సామాన్య ప్రజల పైన పెను భారం పడిందని అన్న విమర్శలు వస్తున్నాయి.
ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అయితే ధనవంతులు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకే మోడీ పెద్ద నోట్ల రద్దు చేశారని అనేశారు. దీనికి బిజెపి వారి నుండి సమాధానం ఇంకా రావలసి ఉంది.