ఓ ఉన్నత పాఠశాల టీచర్ గా జీవితాన్ని ప్రారంభించి ఆతరువాత మంత్రి స్థాయికి ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కేరళ హెల్త్ మినిస్టర్ కె.కె. శైలజ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఉన్న ప్రతిఒక్కరి జీవితంలో 2020వ సంత్సరాన్ని ఎప్పటికి మర్చిపోరు. సాధారణ మనుషుల నుండి ఉన్నత స్థాయిలో బ్రతుకుతున్న వ్యక్తులు కూడా గడ్డు కాలంలో బ్రతికింది ఈసంవత్సరంలోనే. మనుషుల్లో ఉన్న మానవత్వాన్ని కూడా బయటకి తీయగలిగింది ఈ కరోనా మహమ్మారి. లాక్ డౌన్ తర్వాత చాలా మంది మంత్రులు నాయకులు కరోనాకి బయపడి బయటకు రాలేదు, ఒక మహిళా మంత్రి అయి ఉండి కరోనా కట్టడికి ఆమె చేసిన సేవలను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది ఈ మంత్రి శైలజ టీచర్.
ఏడు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఎస్ఎఫ్ఐ కార్యాలపాలలో చురుగ్గా ఉంటూ ప్రజలకు సేవచేసేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి సిపిఎం పార్టీలో చేరింది శైలజ. ఆ తరువాత రాష్ట్ర మహిళా అస్సోసియేషన్ సెక్రటరీతో పాటు చాలా మహిళా సంస్థలకు సెక్రెటరీగా పని చేసింది. ఆ ఆతరువాత కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయ్ విజయన్ మంత్రి వర్గంలో ఈమెకు ఆరోగ్యశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పదవి చేపట్టింది. చట్టబద్ధతతో, వృత్తి మీద ఆపార గౌరవంతో పనిచేసి అందరి మన్నలను అందుకుంది. ఆరోగ్యం బాగలేకపోయిన, రాత్రి అని లేదు పగలు అని లేదు అందరికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ సామాన్యులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది ఈ హెల్త్ మినిస్టర్.
కేరళలో కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు మంత్రి శైలజ ఎంతగానో కృషి చేసింది. కరోనా కట్టడికి రెండు బృందాలను ఏర్పాటు చేసి కఠిన నిర్ణయాలు తీసుకొని వైరస్ పెరుగుదలను అడ్డుకోగలిగింది. అంత్యంత టూరిస్ట్ ప్లేస్ అయినప్పటికీ కేరళలో కరోనా ఉదృతి పెద్దగా పెరగలేదు. ప్రతిరోజు పత్రికా సమావేశాలను పెట్టి తాజా పరిస్థితులను వెల్లడించేది. తన అద్భుత నాయకత్వంతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. తన రాష్ట్రంలో కరోనాతో పోరాడటానికి ఆమె చేసిన ప్రయత్నాల కోసం, ఐక్యరాజ్యసమితి పబ్లిక్ సర్వీస్ డే 2020 లో ప్యానెల్ చర్చలో పాల్గొనడానికి ఆమెను ఐక్యరాజ్యసమితి ఆహ్వానించింది. గార్డియన్ అనే మ్యాగజిన్ ఆమెను “కరోనావైరస్ స్లేయర్”, “రాక్ స్టార్ ఆరోగ్య మంత్రి” గా అభివర్ణించింది. ఆమె ప్రతిభను గుర్తించిన బిబిసి ఆసియా మహిళా కరోనా యోధుల జాబితాలో ఆమె పేరును చేర్చింది.