Covid Strain : కోవిడ్ కారణంగా లాక్ డౌన్ విధించిన సమయంలో టాలీవుడ్ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అయిన విషయం తెలిసిందే. అన్నీ పరిశ్రమలతో పోలిస్తే సినీ పరిశ్రమ భారీగా నష్టపోయింది. దక్షిణ భారతదేశం, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతీ ఒక్క చిత్రసీమకు తీరని నష్టం వాటిల్లింది.
ఇప్పుడిప్పుడే జోరుగా
అయితే కోవిడ్ కల్లోలం నుండి తొలిగా కోలుకొని నిదానంగా షూటింగ్ మొదలు పెట్టి థియేటర్ రిలీజ్ లకు కూడా భయపడని పరిశ్రమగా టాలీవుడ్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ వచ్చేసిన తర్వాత థియేటర్లో సినిమా రిలీజ్ లు మరింత ఊపందుకున్నాయి. ‘ఉప్పెన‘ సినిమా అయితే అవలీలగా రికార్డులు కొల్లగొడుతూ ముందుకు వెళుతుంది. అల్లరి నరేష్ ‘నాంది‘ సినిమా కూడా నిన్నే బ్రేక్ ఈవెన్ సాధించింది.
Covid Strain : ముంబై స్ట్రైన్ తోనే డేంజర్
ఇలా దూసుకుపోతున్న టాలీవుడ్ కు ఊహించని విధంగా ముంచుకొచ్చిన కోవిడ్ కొత్త స్ట్రైన్ లు తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం ముంబై–మహారాష్ట్ర ప్రాంతంలో ఈ కొత్త రకం స్ట్రైన్ తీవ్రం అవుతుండటంతో ఈ సారి ఒక రోగం మునుపటి కంటే ప్రమాదకరం కావచ్చు అనే చర్చ మొదలైంది. అటు ముంబై–ఢిల్లీ అంటూ అన్ని వైపులా విస్తరించిన ఈ కోవిడ్ స్ట్రైన్ మరోసారి టాలీవుడ్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు చాలామంది చెబుతున్నారు. దీంతో ఫిలింనగర్ లో టెన్షన్ వాతావరణం అలుముకుంది.
హైదరాబాదులోనూ అదే పరిస్థితి
అంతేకాకుండా హైదరాబాదులో గణనీయంగా పెరుగుతున్న కేసులు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో అన్ని చోట్ల అప్రమత్తత నెలకొంది. ఒకవేళ కొత్త స్ట్రైన్ కనుక తీవ్రతరం అయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో టాలీవుడ్లో లో అందరూ టెన్షన్ కి గురి అవుతున్నారు. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ లు జరుగుతుంటే ఎంతో మంది నిర్మాతలు రిలీజ్ డేట్లు లాక్ చేసుకుని కూర్చున్నారు. ఇలాంటి సమయంలో వారిలో కలవరం మొదలైంది.
ఈ సమయంలో కరోనా మళ్ళీ విజృంభించి షూటింగులు ఆగి రిలీజ్ వాయిదా పడితే అటు నిర్మాతలు, పరిశ్రమ కోలుకోవడం చాలా కష్టం. సినీ కార్మికులు ఉపాధి కోల్పోతే పరిశ్రమకు ఉనికి ఉండదు. మరి ఈ కొత్త స్టైన్ ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న గా మారింది. దీనికి సమాధానం కావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే….