Nimmagadda VS CM Jagan : మార్చి 31 ఎప్పుడు వస్తుందో.. ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎప్పుడు రిటైర్ అవుతారో..!? ఆయన ఆ కుర్చీలో ఉండే వరకు ప్రభుత్వానికి ఆయనకు పడదు. మాటిమాటికి కోర్టులకు వెల్తూనే ఉంటారు. ఏ క్షణం, ఏ రోజు ఏమౌతుందా..? అంటూ సగటు రాజకీయ వాదికి ఒక పెద్ద పరీక్ష..! నిమ్మగడ్డ (Nimmagadda Ramesh kumar) ఎన్నికలు నిర్వహించని.., వదిలేయనీ.. ఏమైనా కానీ … ఈ ఏపీలో లొల్లి మాత్రం ఆగడం లేదు. సర్పంచి ఎన్నికలు అంటూ ఇన్నాళ్లుగా జరుగుతున్న లొల్లి కేవలం ట్రైలర్ మాత్రమే. అసలైన పెద్ద సినిమా ముందుంది. ఇంకా మున్సిపల్, పరిషత్ ఎన్నికలను రేపో, ఎల్లుండో నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్ల సాక్క్షిగా YS Jagan (జగన్) X నిమ్మగడ్డ మధ్య ఓ పెద్ద వార్ కి తెరలేవనుంది..! ఎలా, ఎందుకు..? అనేది చూద్దాం పదండి..!!
Must Read : మార్చి 5 న తేలనున్న సీఎం జగన్ భవితవ్యం..!?
Nimmagadda VS CM Jagan : నోటిఫికేషన్లు ఎలా ఇవ్వనున్నారు..!?
రాష్ట్రంలో సర్పంచి ఎన్నికలు మాత్రమే ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ నెల 17 న మూడోదశ.., 21 న నాలుగో దశ ఎన్నికలతో అవి ముగియనున్నాయి. అంటే నిమ్మగడ్డ బాధ్యత తీరినట్టు కాదు. ఇంకా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నిజానికి ఈ సర్పంచుల ఎన్నికలు కంటే ఆ ఎన్నికలే అత్యంత ముఖ్యం. అందుకే ఆ నోటిఫికేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
* గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 24 శాతం ఎంపీటీసీ స్థానాలు, 21 శాతం జేడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. నాడు కరోనా కారణంగా అర్ధాంతరంగా ఆపేసారు. ఒకవేళ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఫ్రెష్ గా షెడ్యూలు ఇస్తారా..? లేదా ఎక్కడ ఆగాయి అక్కడి నుండి కొనసాగిస్తారా..? అనేది పెద్ద అనుమానం. ఒకవేళ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇస్తే గత ఏడాది నాటి ఏకగ్రీవాలు అన్నీ వైసీపీ కోల్పోయినట్టే. అందుకు జగన్ కానీ.. ఆ పార్టీ కానీ అంగీకరించే పరిస్థితి లేదు. అందుకే నిమ్మగడ్డ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కోర్టుకు వెళ్లేందుకు ఆల్రెడీ కొన్ని న్యాయ సూత్రాలను పట్టేసుకుంది. ప్రభుత్వంతో పాటూ.. నాడు ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కూడా అనుబంధ పిటిషన్ వేయనున్నారు.
ఒకవేళ పాతవి కొనసాగిస్తే టీడీపీ కూడా..!!
ఫ్రెష్ నోటిఫికేషన్ / షెడ్యూల్ కాకుండా.. గత ఏడాది ఎక్కడ ఆగాయి.. అక్కడి నుండి కొనసాగింపు అంటూ నిమ్మగడ్డ ప్రకటిస్తే వైసీపీకి పండగే. నాడు ఏకగ్రీవం చేసుకున్న స్థానాలన్నీ నిలబడినట్టే. కాకపోతే అదే జరిగితే టీడీపీ కోర్టులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ నిమ్మగడ్డని అడ్డముగా ఇరికించే ప్రణాళిక కూడా వేసింది. “గత ఏడాది తనను ఎన్నికల కమీషనర్ గా తనను తొలగించినప్పుడు ఆయన కోర్టులో దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో “రాష్ట్రంలో జరిగిన ఏకగ్రీవాలు అన్ని అక్రమాలే, నేను అవి అడ్డుకుంటాను కాబట్టి నన్ను తొలగించారు” అంటూ ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. అంటే ఆయన నాటి ఏకగ్రీవాలు అన్ని అక్రమాలు అంటూ కోర్టులో ఒప్పుకున్నట్టే. సో.. ఈ పాయింట్ ఆధారంగా నిమ్మగడ్డని ఇరికించి… ఏకగ్రీవాలను రద్దు చేయించాలని టీడీపీ ఉంది..! సో.. నిమ్మగడ్డ మాత్రం ఫ్రెష్ నోటిఫికేషన్ / షెడ్యూల్ ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తుంది..!!