ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కులం ప్రాతిపదికన ఓట్లు చాలా కీలకం. ఎంతకాదన్నా ఇది ఎవరూ బయటకు చెప్పలేని వాస్తవం. అయితే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి బెజవాడ కీలక నేత వంగవీటి రాధా రాజకీయ నిరుద్యోగి కింద లెక్క. మరి అతనికి సరైన పని, అవసరం పొజిషన్ కల్పించేందుకు ఏపీ బిజెపి సిద్ధమై పోయిందట. ఆ సంగతేంటో చూద్దామా..?
చేజేతులా…
ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వంగవీటి రాధా ఎన్నో అంచనాలతో ఎంతోమంది అనుచరగణంతో రాజకీయాల్లోకి దిగారు. అయితే ఆయన మాత్రం ఏరోజు నిలకడగా కనిపించింది లేదు. 2019 ఎన్నికలకు ముందు వరకు వైసిపి లో ఉండి ఆ తర్వాత దారుణమైన రాంగ్ స్టెప్ వేసి టిడిపిలోకి మారారు. వంగవీటి మోహన రంగా అనంతరం ఆయన రాజకీయ వారసుడిగా ఒక వర్గం భావించే వంగవీటి రాధా తన జీవితం రాజకీయ జీవితం తన చేతితోనే పాడే చేసుకున్నాడు అనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.
అంత నమ్మకమా..?
గతంలో రాధా జనసేనలోకి వస్తున్నాడు అన్న వార్తలు బలంగా వచ్చాయి. అటు టిడిపి లో ఉండ లేక ఇటు వైసీపీకి వెనక్కి వెళ్ళలేక తీవ్రంగా మదనపడిన రాధా.. నాదెండ్ల మనోహర్ ను కలిసిన తర్వాత జనసేన పార్టీలో అతను ఎంట్రీ ఖాయం అని అనుకున్నారు. కానీ ఎందుకో ఆ పరిస్థితి రాలేదు. అయితే ఇప్పుడు తాజాగా బీజేపీ లోని కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. గట్టిగా చెప్పాలంటే బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు మార్గదర్శకాల మేరకు వంగవీటి రాధా తో మంతనాలు జరుపుతున్నారట. ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన వంగవీటి రాధా తమ పార్టీలో ఉంటే అది మరింత బలాన్ని చేకూరుస్తుందని వారి నమ్మకం కాబోలు
50-50 చాన్సులు
అయితే నాణానికి మరోవైపు చూసుకుంటే వంగవీటి రాధా పైన అటు రాష్ట్ర ప్రజల మాట పక్కన పెడితే ఇటు విజయవాడ వాసులు కూడా ఏమంత సానుకూలంగా లేరు. ఆయన ఒకే పార్టీ కి స్టాండ్ తీసుకోకపోవడం…. ఇంకా నిలకడలేని రాజకీయాలకు పెట్టింది పేరు కావడంతో ఈ మార్పు పై పెద్దగా అంచనాలు లేవు. ఇప్పటికే ఏపీ బిజెపి పడుతూ లేస్తూ ముందుకు వెళుతోంది. సోము వీర్రాజు వచ్చిన తర్వాత కొంచెం మెరుగైన ఫలితాలు వస్తునా కూడా…. ఇటువంటి కఠిన నిర్ణయాలు కీలక సమయంలో తీసుకుంటే మాత్రం రిస్కు-లాభం సగం సగం ఉంటాయి అన్నది రాజకీయ పరిశీలకుల మాట.
రాధా బీజేపీ లోకి వస్తే పెద్ద నష్టం లేదు కానీ అతను లాగ్ టర్మ్ కొనసాగలేకపోతే పార్టీకి చాలా పెద్ద ప్రతికూలం అవుతుంది. కానీ క్లిక్ అయితే మాత్రం ఎప్పుడూ లేని విధంగా ఏపీ బీజేపీ సరికొత్త పుంతలు తొక్కుతుంది. మరి చివరికి ఏమవుతుందో..?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?