ఒక్క ట్వీటు ఇప్పుడు దేశం మొత్తం హాటుగా మారింది. మచ్చలేని మోడీపై నానా నిందలేసింది. మోడీ కుటుంబం మొత్తం చరిత్ర విప్పేసింది. గుజరాత్ లో మోడీల గతం.., ప్రస్తుతం ఇలా అంటూ చెప్పేసింది..! యావత్ దేశంలో రాజకీయ వర్గాలు.. అటు విపక్షాలు, ఇటు బీజేపీ వాళ్ళు కూడా ఆ ట్వీటు వెనుక నిజాలు నిర్ధారించుకునే పనిలో పడ్డారు. ఆ ట్వీటు, మోడీల మార్పులు ఓ సారి గమనిస్తే..!!
* సోమాభాయ్ మోడీ ( 75 ) గతంలో ఆరోగ్యశాఖలో పని చేసారు. తర్వాత వృద్ధాశ్రమాన్ని నడిపారు. ప్రస్తుతం గుజరాత్ లో రిక్రూట్మెంట్ బోర్డు కి చైర్మన్ గా ఉన్నారు. ఈయన ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు.
* అమృత్ భాయ్ మోడీ ( 72 ) గతంలో ఒక ప్రైవేట్ పరిశ్రమలో పని చేశారు. నెలకు రూ. 12 వేలు వేతనం. ప్రస్తుతం అహ్మదాబాద్ , గాంధీ నగర్ లో కీలక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నారు. ఈయన కూడా ప్రధాని మోడీకి సోదరుడు.
* ప్రహ్లాద్ మోడీ (64 ).. గతంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు. ప్రస్తుతం గుజరాత్ లోని వడోదర, అహ్మదాబ్ నగరాల్లో హ్యుందాయ్, హొండా, మారుతి కార్లు షోరూములు ఉన్నాయి. ఈయన ప్రధాని నరేంద్ర మోడీ సోదరుడు.
* పంకజ్ మోడీ (58 ).. గతంలో సమాచార శాఖలో చిన్న స్థాయి ఉద్యోగిగా ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో సోమాభాయ్ మోడీ చైర్మన్ గా ఉన్నా రిక్రూట్మెంట్ బోర్డుకి వైస్ చైర్మన్ గా ఉన్నారు. ఈయన కూడా ప్రధాని మోడీ సోదరుల్లో చిన్నోడు.
* భోగిలాల్ మోడీ.. (67 ).. గతంలో అహ్మదాబాద్ లో కిరాణా దుకాణం ఉండేది. ప్రస్తుతం అహ్మదాబాద్, సూరత్, వడోదరలో రియలన్స్ మాల్స్ ఉన్నాయి. ఈయన ప్రధాని మోడీకి కజిన్.
* అరవింద్ మోడీ (64 ).. గతంలో చెత్త సేకరించేవారు. అహ్మదాబాద్ శివార్లలో వీధుల్లో చెత్తను ఏరుకునే వారి దగ్గర కొనుక్కుని.. వాటిని అమ్మేవారు. నెలకు రూ. 10 వేల వరకు ఆదాయం వచ్చేది. ప్రస్తుతం అహ్మదాబాద్ లో కీలక రియల్ ఎస్టేట్, సెట్ల్ కంపెనీలకు కాంట్రాక్టర్ గా ఉన్నారు. మరో కజిన్ అశోక్ మోడీ కూడా దీనిలో భాగస్వామి.
* భరత్ మోడీ (55 ) .. గతంలో పెట్రోల్ పంపులో పని చేసేవారు. ప్రస్తుతం అహ్మదాబాద్ లో సొంత బంక్ ఉంది. ఈయన ప్రధానికి కజిన్. * మరో కజిన్ చంద్రకాంత్ మోడీ కూడా గతంలో గోశాలలో పని చేసేవారు. ప్రస్తుతం సొంత డైరీలు నడుపుతున్నారు. * గతంలో ప్రైవేట్ స్కూళ్ళులో టీచర్ గా పని చేసిన రమేష్ మోడీ.. ప్రస్తుతం అయిదు స్కూళ్ళు, మూడు కాలేజీలకు ఓనర్. దీనిలో భార్గవ మోడీ కూడా భాగస్వామి. ఇక చివరిగా బిపిన్ మోడీ గతంలో గ్రంధాలయం లో పని చేయగా… ప్రస్తుతం పాఠశాల పుస్తకాల సరఫా కంపెనీకి ఓనర్ గా ఉన్నారు.
ప్రధాని మోడీ నిత్యం తనకు కుటుంబం లేదని.. తన అధికారంతో ఈనాడు ఎవ్వరికీ సాయం చేయలేదని చెప్తుంటారు. కానీ… ప్రధాని సోదరులు, బంధువులు అందరూ కోటీశ్వరులు అయిపోయారు..!? అంటూ రాధా చరణ్ దాస్ చేసిన ట్వీట్లు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనిలో నిజాలు నిర్ధారించుకునేందుకు చాలా మంది ఆ పేర్లని గూగుల్ లో వెతుకుతున్నారు. మొత్తానికి ఈ ట్వీటు దేశంలో కొత్త చర్చకు దారితీసింది. మోడీ కుటుంబంపై, ప్రధాని పీఠంపై పెద్ద మచ్చ వేసింది.