ధోని భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. తన నాయకత్వ పటిమతో టీ20, వన్డే ప్రపంచకప్ లను సాధించి పెట్టిన ధోని ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ తరువాత జీవితాన్ని కూడా ధోని ప్రకటించాడు. క్రికెట్ బ్యాట్ చేతబట్టి హెలికాప్టర్ షాట్లతో మెప్పించిన ధోని ఇప్పుడు కోళ్లను పట్టి వాటి మీద వ్యాపారం మొదలుపెట్టానున్నాడు. కొత్త వ్యాపారం వినూత్నంగా, ఆరోగ్యవంతంగా, పరిధులు లేని ప్రత్యామ్నాయం లేని వ్యాపారాన్ని ధోని ప్రారంభించనున్నాడు అదే కడక్ నాథ్ కోళ్ల పెంపకం. ఇప్పటివరకు కడక్ నాథ్ కోళ్ల పౌల్ట్రీ లు ఉన్నప్పటికీ, చాలా సదాసిదగా స్థానిక వ్యాపారాలు సాగుతున్నాయి. ఈ రంగంలోకి ధోనీ వస్తే ఒక బ్రాండ్ అంబాసిడర్ అవడమే కాకుండా ఈ వ్యాపారాన్ని మొత్తం తను ఆక్రమించుకునే అవకాశం ఉంది. ఏకంగా 100 కోట్ల పెట్టుబడి తో ధోని ఈ వ్యాపారం లోకి దిగితున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
ఏమిటి కడకనాధ్ కోళ్లు??
చూడటానికి నల్లగా, నల్ల బొగ్గు మాదిరిగా కనిపించే ఈ కోళ్ళు మధ్యప్రదేశ్లోని ఓ కుగ్రామంలో దొరికేవి. ఒక గిరిజన రీడ్ కు చెందిన ఈ కోళ్లు పదేళ్ల క్రితం వరకు ఎవరికీ తెలీదు. ఈ కోళ్లను తినడం వల్ల ఫ్యాట్ పెరగదు. కోలేష్ట్రాల్ అతి తక్కువ మోతదులో ఉంటుంది. ప్రోటీన్స్, ఐరన్ బాగా లభ్యం అవుతుంది. ప్రస్తుతం పెద్ద పెద్ద నగరాల్లో కడక్నాథ్ మాంసం లభిస్తోంది. కేజీ 400 వరకు ఉండే ఈ మాంసం అస్తమాను, బీపీ ను, మధుమెహ రోగులకు ఎంతో బాగా పని చేస్తుందని ప్రచారం ఉంది. ఇప్పటి వరకు చిన్న చిన్న పౌల్ట్రీ లు పెట్టి ఈ కోళ్లను పెంచి వాటి మాంసాన్ని అమ్మేవారు. ధోని రంగంలోకి దిగితే ఈ వ్యాపార విస్తరణ బాగా పెరుగుతుంది.
డిమాండ్ పెరుగుతుంది
కడకనాథ్ కోళ్ల కు మొదట్లో అంత డిమాండ్ లేకున్నా, కరోనా విపత్తు కాలంలో ఆరోగ్యం పై ప్రజలకు జాగ్రత్త పెరగడంతో పాటు చికెన్ కు విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. కిలో చికెన్ 350 వరకు వెళ్ళింది. ఈ సమయం లోనే కడక్నాథ్ కోళ్ల లో అద్భుతమైన ప్రోటీన్లు ఉన్నాయని కొవ్వు తక్కువగా ఉంటుందని వీటిని తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందనే ప్రచారం ఉన్నత వర్గాల్లో విపరీతంగా జరిగింది. ఫలితంగా కడక్నాథ్ కోళ్ల కు చిన్న పట్టణాల్లో సైతం డిమాండ్ ఏర్పడింది. చికెన్ కు ఈ మాంసనికి ధర విషయంలో పెద్దగా తేడా లేకపోవడం తో వీటిపై ఇప్పుడు అందరి ద్రుష్టి పడుతుంది. అంటే భారత మాజీ క్రికెట్ కెప్టెన్ భవిష్యత్తు మీద దృష్టి పెట్టి ఈ వ్యాపార రంగంలోనూ హెలికాఫ్టర్ షాట్ లు ఆడతారని అభిమానులు ఆశిస్తున్నారు.