రాపాక వరప్రసాద్ తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే. అయితే ఇతని పేరు తెలియని వారు రాష్ట్రంలో ఉండరు అంటే అతిశయోక్తి కాదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫునుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కావడమే ఇప్పటి వరకు సాధించిన ఘనత. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంటాడు అని ఆశించిన తమ నియోజకవర్గ ప్రజలకు మరియు జనసేన పార్టీ అభిమానులను అతను నిరాశపరిచిన తీరులో కూడా అతను ఫేమస్. ఇప్పటివరకు ఆయన ఆడుతున్న డబుల్ గేమ్ కూడా అందరిలోకి అతని ప్రత్యేకంగా నిలిపింది.
పార్టీలో రాపాక పనితీరు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కు అతను పక్కలో బల్లెంలా గా మారిన తీరు అయితే అతనిపై ఎన్నో విమర్శలకు దారితీసింది. గెలిచిన వెంటనే తాను ఎక్కడికి మారనని… జనసేన పార్టీలోనే ఉంటానని చెప్పిన ఆయన ఆ తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేయడం ప్రారంభించాడు. పార్టీ మారకపోయినా అటు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటూ ప్రభుత్వం తీసుకున్న అనేక కీలక నిర్ణయాల్లో ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ ఏకంగా తన సొంత పార్టీకే అన్యాయం చేయడం అనేది రాపాక అజెండా. జగన్ చిత్రపటానికి పాలు పోస్తారు… అసెంబ్లీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పాలని వారి పార్టీ హైకమాండ్ నుండి ఆదేశాలు వచ్చినా జగన్ వెంటే ఉంటా అంటారు.
ఇక ఇతని నుండి జనసేన మరి ఏమీ ఆశించకూడదు అని అనుకుంటున్న సమయంలో వారి ఎదుగుదలకు కృషి చేయాల్సిన రాపాక చివరికి వైసిపి పార్టీ అనీఫషయల్ ఎమ్మెల్యే గా వ్యవహరిస్తున్నారు. ఇక మొన్నటి స్థానిక ఎన్నికల్లో సైతం రాపాక వరప్రసాద్ తో పాటు నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్గా ఉన్న బొంతు అమ్మాజీ, అమలాపురం ఎంపీ చింతా అనూరాధ కలిసి ఇక్కడ వైసీపీ బీఫామ్లు పంచుకున్నట్టు టాక్ కూడా ఉంది. ఇక రాపాక వరప్రసాద్ తన వ్యవహార శైలీతో నియోజకవర్గంలో జనసేన కేడర్తో పాటు పవన్ అభిమానులకు పూర్తిగా దూరమయ్యారు.
రానున్న ఈ రోజుల్లో రాపాక డబుల్ గేమ్ జనసేనకు ఎంత నష్టం చేకూరుస్తుందో మరియు వారిని తమ పతనానికి ఎంత దగ్గరగా తీసుకొని వెళుతుందో వేచి చూడాలి.