ఉన్నట్టుండి ఒకామె పోలీస్ స్టేషన్ కు వచ్చింది. నన్ను 139 మంది ఐదు వేల సార్లు రేప్ చేశారు అని స్టేట్ మెంట్ ఇచ్చింది. ఎన్నో రోజుల నుండి తనని బెదిరిస్తూ…. చంపేస్తాం అని చెప్పి హింసిస్తూ తనపై పలుసార్లు చాలామంది అఘాయిత్యానికి పాల్పడ్డారని వాపోయింది. అంతే ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం ఉలిక్కిపడింది.
అసలు ఎవరెవరు.. ఎలా చేశారు..?
“వేర్వేరు సందర్భాల్లో కొన్నేళ్లుగా ఆమె నగ్న చిత్రాలు తీసి బెదిరిస్తూ…. అంగీకరించకుంటే చంపేస్తామంటూ పలుసార్లు వీడియోలు అప్ లోడ్ చేస్తామంటూ…. కులం పేరుతో దూషిస్తూ.. మారణాయుధాలతో బెదిరిస్తూ నా జీవితాన్ని నాశనం చేశారు.” ఇది అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్. “అందులో తెలంగాణ వాళ్లే కాదు…. మహారాష్ట్ర, గోవా, బెంగళూరు, చెన్నై, ఆస్ట్రేలియా, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా చెప్పిన తర్వాత కూడా నన్ను చంపేస్తారు. ఇదే నా మరణవాంగ్మూలం. నా మృతదేహాన్ని ఫౌండేషన్ కు అప్పగించండి” అని మిర్యాలగూడకు చెందిన అమ్మాయి ఫిర్యాదు చేసింది. ఆమెకు ఎప్పుడో పెళ్లి అయింది… విడాకులు కూడా అయిపోయాయి. భర్త తరఫున వాళ్ళందరూ లైంగికంగా వేధించారని…. అలాగే తనతో పాటు ఇంకా చాలా మంది అమ్మాయిలను కూడా ఇలాగే బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పింది.
ఈ పేర్లు విన్నారా?
ఇక్కడ మరింత సెన్సేషన్ ఏమిటంటే…. నిందితుల్లో 16 విద్యా సంఘాల నేతల పేర్ల తో పాటు ప్రముఖ యాంకర్ ప్రదీప్, హీరో కృష్ణుడు మాత్రమే కాదు ఏకంగా మాజీ ఎంపి పిఎ తదితరులు…. దేశ విదేశాల్లో ఉన్న బోలెడుమంది ఉన్నారని బహిర్గతం చేసింది. ఇక పోలీసులకు ఫిర్యాదు వచ్చింది కాబట్టి తప్పక రాసుకోవాలి. పట్టించుకోకపోతే తమను నిందల పాలు చేస్తారు. అందులో సున్నితమైన ఎస్సీ ఎస్టీ అత్యాచారం లైంగిక విషయాలు ఉన్నాయి. కాబట్టి ఆమె చెప్పిన వారందరి మీద కేసు బుక్ చేయాలి. ఇందులో నిజానిజాలేమిటో ఎలా తెలుసుకోవాలి అన్నది వారి ముందున్న సవాల్.
ఎవరి దారెటు?
ఇప్పుడు తెలుగు బుల్లితెర లో టాప్ యాంకర్ గా ఎదుగుతున్న ప్రదీప్ విషయానికే వద్దాం. గతంలో మందుకొట్టి దొరికిపోతే.. నాలుగు రోజులు అజ్ఞాతంలో ఉండి పోతే పోలీసులు కాస్త సానుకూలంగా వ్యవహరించి ఏదో కౌన్సిలింగ్ నిర్వహించి పంపేశారు. ఇక ప్రదీప్ వంటి వారిని ఫిర్యాదులో పేర్కొన్నది ఈ కేసులో బాధితురాలు. ఇక ఈ సంక్లిష్టమైన కేసు విషయానికి వస్తే ఇందులో ఎస్ఎఫ్ఐ నాయకుల పేర్లు ఉన్నాయి. మరి సిపిఎం పార్టీ ఏం చేయాలి? అఫీషియల్ గా ఏమైనా ప్రకటించాలా లేక ముందు యాక్షన్ తీసుకోవాలా?
అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాంటి విషయంపై ఎలా స్పందించాలి? జాతీయస్థాయిలో దిశా కేసులా రచ్చ అయితే తప్పించి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిపై స్పందించదా? ఇక బాధ్యత కలిగిన ప్రభుత్వం ఇంకా సంఘీభావం కూడా ప్రకటించలేదు అని అంటారు. మొత్తానికి అనేక ప్రముఖ పేర్లతో కూడిన ఈ కేసులో తర్వాత ఏమిటి అన్నది అందరికీ సస్పెన్స్. అసలు తను చెప్పింది నమ్మశక్యంగా ఉందా లేదా అని పక్కన పెడితే.. ముందు కేసు ముందుకు వెళ్ళాలి…. విచారణ జరగాలి. నేరం రుజువైతే నిందితులని అత్యంత కఠినంగా శిక్షించాలి. ఈ అమ్మాయి కథ అల్లింది తెలిస్తే కౌన్సిలింగే. దిశ రేప్ ఘటన లో కేసిఆర్ మరియూ పోలీసు యంత్రాంగం చాలా చాకచక్యంగా డీల్ చేసి, నిందితులని ఎన్ కౌంటర్ చేసి పడేశారు. అదే విధంగా ఇలాంటి కాంప్లికేటెడ్ కేస్ ని డీల్ చేయడం ‘ ఒకరకమైన ‘ పరువు ప్రతిష్ట లకి ప్రభుత్వం యొక్క ‘ ఇజ్జత్ ‘ కి సంబంధించినదే అని కొందరు కామెంట్ చేస్తున్నారు .. మరి కేసీఆర్ దారెటు…?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?