ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి అంటారు పెద్దలు… జీవితంలో ఇది కచ్చితంగా జరుగుతుంది. ప్రతి మనిషికి ఎక్కడో దగ్గర ఎదురవుతుంది. తమిళనాడు రాజకీయాలను ఒకప్పుడు శాసించి… అందరూ ఆప్యాయంగా పిలుచుకునే అమ్మకు అత్యంత దగ్గర వ్యక్తిగా గుర్తింపు పొందిన శశికళ పరిస్థితి ఇప్పుడు అత్యంత దీనంగా, చావుతో కొట్లాడుతూ ఆస్పత్రిలో ఉంది. జయలలిత సమాధి మీద శపథం చేసి మరి.. బొట్టు పెట్టి తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారుతారని భావించిన శశికళ… ఒకేసారి ఆసుపత్రి పాలవడం అందులోనూ ఐసీయూలో క్షణక్షణం చావుతో పోరాడడం ఇప్పుడు.. ఆమె అభిమానులను కన్నీటి పర్యంతం చేస్తోంది. అసలు తమిళనాడు రాజకీయాలు ఎటు వెళ్తాయో ఏం జరగబోతోంది అన్నది జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశంగా మారుతోంది. తమిళనాడు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఒక్కొక్క అంశం ఒక బాంబు పేలినట్లు తమిళనాడు ని షేక్ చేస్తోంది.
ముందుగా విడుదల అయిన!!
అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవించి… 10 కోట్లు పెట్టి మరి ఒక ఏడాది ముందుగానే జైలు నుంచి విడుదల కు మొత్తం సిద్ధం చేసుకున్న శశికళ జనవరి చివర్లో అత్యంత ఆరోగ్యంగా జైలు నుంచి విడుదలై తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతానని అంతా భావించారు. అయితే ఆమె ఉన్నట్టుంది కరోనా బారిన పడడం ఆమెకి ఉన్న సుదీర్ఘమైన వ్యాధులు ఆమెను మరింత కుంగదీసింది డంతో ఆస్పత్రిలో చేరారు. అక్కడ పరిస్థితి విషమంగా మారడంతో ఐసీయూలో దినదినగండంగా గడుపుతున్నారు. శశికళ రాకతో తమిళనాడు రాజకీయాలు మొత్తం మారతాయని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కింగ్ లేదా కింగ్ పిన్ అవుతారని అంతా భావించారు. అన్నా డీఎంకే నుంచి సైతం ఎమ్మెల్యేలు నాయకులు ఆమె సారథ్యంలోని ఏఎంఎంకే లో చేరతారని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేశారు. అయితే ఇప్పుడు శశికళ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో పరిస్థితులన్నీ మరోసారి తారుమారు అవుతున్నాయి. శశికళ జైలులో ఉన్నప్పుడు పార్టీకి పెద్దదిక్కుగా మారిన దినకరన్ సైతం శశికళ ఆరోగ్యం మీద బెంగ తో ఉన్నారు. ఆమె బయటకు వస్తే రాజకీయంగా చాలా మార్పులు చూడవచ్చని.. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు ప్రధాన పోటీ శశికళ పార్టీ అవుతుందని లెక్కల కొడుతున్న తరుణంలో ఆమె ఒకేసారి ఆస్పత్రి పాలు అవడంతో పాటు ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు కంగారు పుట్టిస్తున్నాయి.
అన్నీ స్టాలిన్ కు అనుకూలతలే!
తమిళనాడు రాజకీయాల్లో ఈ మధ్యన జరిగిన పరిణామాలన్నీ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కు అనుకూలంగానే సాగుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పాత్రలో బలంగా ఉన్న డిఎంకె ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమిళనాడు పీఠం అధిరోహించి స్టాలిన్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని అంతా భావించారు. అయితే దాని తర్వాత రజనీ పార్టీతో పాటు శశికళ విడుదల దగ్గర పడటంతో… ఈ రెండు అంశాలు డిఎంకె విజయావకాశాలను దెబ్బతీస్తాయని, బిజెపి ఆడిస్తున్న డ్రామా లో ఓట్ల చీలిక ఖచ్చితంగా డీఎంకేకు నష్టం చేకూరుస్తుందని అందరూ అంచనా వేశారు. అయితే తర్వాత రజనీ రాజకీయ పార్టీని రద్దు చేసుకోవడం.. ఇప్పుడు విశ్లేషకులు సైతం ఆస్పత్రి పాలు అవ్వడం వంటి విషయాలు డీఎంకేకు సానుకూల అంశాలే. ఇప్పటికే తమిళనాడు మొత్తంమీద రాజకీయ వాతావరణం నెలకొంది. స్టాలిన్ సైతం వడివడిగా తన అనుకూల కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో వివిధ పార్టీల నుంచి నాయకులను, రజినీ అభిమానులను డీఎంకే వైపు తిప్పుకోవడం లో స్టాలిన్ ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా ఇప్పుడు శశికళ వ్యూహం కూడా చెల్లాచెదురు అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపించడం తో పాటు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎవరికి వారు రాజకీయ దారి చూసుకోవడం వారు కూడా డీఎంకే వైపు ఆశగా చూడడంతో… ఈ అవకాశాలన్నీ స్టాలిన్ ఒడిసి పట్టుకుఅంటున్నారు. మరి భవిష్యత్తులో ఆయన మరింత ఏం చేయనున్నారు తమిళనాడు రాజకీయాలు ఎలా మారబోతున్నాయి అనే దానిమీదే భవిష్యత్తు ఆధారపడి ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?