ఏది ఏమైనా కానీ భారత్ లో మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గను అని అంటోంది. రోజు మార్చి రోజు కేసులు పెరుగుతున్నాయే తప్ప అసలు ఎక్కడా ఎటువంటి అభివృద్ధి అయితే కనిపించడం లేదు. ప్రజలంతా ఆందోళన చెందడం కూడా మానేశారు. అయితే ఎక్కడో లోపల భయం ఉండనే ఉంటుంది కదా…! దేశ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నారు కానీ అలా బయటకు తీసిన వారి నుండి వైరస్ వ్యాపించకుండా ఆపలేకపోతున్నారు. ఇక ఈ వైరస్ విషయంలో నిపుణుల హెచ్చరికలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరే చూడండి…
నవ్వాలో…. ఏడవాలో….
భారత్ లో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడంతో కేంద్రం నుండి రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి కూడా. ఈ రాష్ట్రాల్లో మరణాల రేటు కూడా భారీగానే ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో మరణాలు కొంచెం తక్కువే కానీ వైరస్ వ్యాప్తి చెందుతున్న రేటు మాత్రం ఏ దేశానికి తీసిపోకుండా ఉంది.
ఆగస్టులో అల్లకల్లోలం
ఆగస్టు నెలలో కరోనా దెబ్బకు భారత్ చిగురుటాకులా వణికిపోయింది. ఒక్క ఆగస్టు నెలలోనే 20 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే అది మామూలు విషయం కాదు. ఆగస్టు చివరి వారంలో అయితే ఏకంగా 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. జూలై నాటికి 17 లక్షలు ఉన్న కేసులు ఆగస్టు చివరి నాటికి 37 లక్షల కేసులు చోటుచేసుకోవడం గమనార్హం. ఇక భారత్ లో సామాజిక వ్యాప్తి మొదలైందన్న అనుమానాలు భారీగా వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో తెలంగాణ హెల్త్ మినిస్టర్ చెప్పినట్లు అసలు కరోనా సోకని వ్యక్తి మనకు కనిపించడేమో అని అందరూ భయపడుతున్నారు.
అది లేకపోతే కష్టమే….
ఇక సెప్టెంబర్ నెలలో కరోనా వైరస్ ఎవరూ అందుకోలేని రేంజ్ కి వెళుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు ఒక్కరోజులోనే 30 లక్షల కేసులు రెండు నెలలు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ చివరి నాటికి 70 లక్షల కోవిడ్ కేసులు నమోదవుతాయని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక అక్టోబర్ విషయానికి వస్తే ప్రతి నగరంలో కనీసం ఒక శాతం మంది కరోనా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నవంబర్ సంగతి సరేసరి. ఈ లోపల వ్యాక్సిన్ అన్న పదమే లేకపోతే నవంబర్లో భారత్ లోని కరోనా వైరస్ వ్యాప్తి తారస్థాయికి చేరుతుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ చివరి నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి.