NewsOrbit
ట్రెండింగ్ బిగ్ స్టోరీ

సెప్టెంబర్ – అక్టోబర్ – నవంబర్ :: దిన దిన గండం

ఏది ఏమైనా కానీ భారత్ లో మాత్రం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గను అని అంటోంది. రోజు మార్చి రోజు కేసులు పెరుగుతున్నాయే తప్ప అసలు ఎక్కడా ఎటువంటి అభివృద్ధి అయితే కనిపించడం లేదు. ప్రజలంతా ఆందోళన చెందడం కూడా మానేశారు. అయితే ఎక్కడో లోపల భయం ఉండనే ఉంటుంది కదా…! దేశ వ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహిస్తున్నారు కానీ అలా బయటకు తీసిన వారి నుండి వైరస్ వ్యాపించకుండా ఆపలేకపోతున్నారు. ఇక ఈ వైరస్ విషయంలో నిపుణుల హెచ్చరికలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరే చూడండి

 

నవ్వాలో…. ఏడవాలో….

భారత్ లో ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 40 లక్షలు దాటింది. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఎప్పటికప్పుడు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతుండడంతో కేంద్రం నుండి రాష్ట్రాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ అయ్యాయి కూడా. ఈ రాష్ట్రాల్లో మరణాల రేటు కూడా భారీగానే ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో మరణాలు కొంచెం తక్కువే కానీ వైరస్ వ్యాప్తి చెందుతున్న రేటు మాత్రం ఏ దేశానికి తీసిపోకుండా ఉంది.

ఆగస్టులో అల్లకల్లోలం

ఆగస్టు నెలలో కరోనా దెబ్బకు భారత్ చిగురుటాకులా వణికిపోయింది. ఒక్క ఆగస్టు నెలలోనే 20 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే అది మామూలు విషయం కాదు. ఆగస్టు చివరి వారంలో అయితే ఏకంగా 5 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. జూలై నాటికి 17 లక్షలు ఉన్న కేసులు ఆగస్టు చివరి నాటికి 37 లక్షల కేసులు చోటుచేసుకోవడం గమనార్హం. ఇక భారత్ లో సామాజిక వ్యాప్తి మొదలైందన్న అనుమానాలు భారీగా వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో తెలంగాణ హెల్త్ మినిస్టర్ చెప్పినట్లు అసలు కరోనా సోకని వ్యక్తి మనకు కనిపించడేమో అని అందరూ భయపడుతున్నారు.

అది లేకపోతే కష్టమే….

ఇక సెప్టెంబర్ నెలలో కరోనా వైరస్ ఎవరూ అందుకోలేని రేంజ్ కి వెళుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు ఒక్కరోజులోనే 30 లక్షల కేసులు రెండు నెలలు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ చివరి నాటికి 70 లక్షల కోవిడ్ కేసులు నమోదవుతాయని అందరూ అంచనా వేస్తున్నారు. ఇక అక్టోబర్ విషయానికి వస్తే ప్రతి నగరంలో కనీసం ఒక శాతం మంది కరోనా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నవంబర్ సంగతి సరేసరి. ఈ లోపల వ్యాక్సిన్ అన్న పదమే లేకపోతే నవంబర్లో భారత్ లోని కరోనా వైరస్ వ్యాప్తి తారస్థాయికి చేరుతుంది.

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్ చివరి నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందని చెబుతున్నారు. అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri