ఇప్పటివరకూ ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం పవన్ ను వాడుకున్నదే కానీ బాబు ద్వారా పవన్ కు పైసా లాభం చేకూరింది అయితే లేదు. పైగా బాబు తో దోస్తానా ప్రభావం ఎన్నికల ఫలితాల్లో క్లియర్ గా కనిపించింది. పవన్ స్వయంకృతాపరాధాలు ఎన్ని ఉన్నా కూడా బాబు నే పవన్ ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణమన్నది జగమెరిగిన సత్యం. అయితే పవన్ అందుకు తగ్గట్టు ఇప్పుడు బాబు పైనే పన్నాగాలు పన్నుతున్నారు. అందులోనూ విచిత్రంగా బాబు పవన్ వేసిన ట్రాప్ లోనే పడడం గమనార్హం.
అంత సీరియస్ గా తీసుకోవాలా…
పవన్ కళ్యాణ్ రాజధాని విషయమై తన అజెండా తెలిపేందుకు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో వైసిపి ఎమ్మెల్యేలు మరియు టిడిపి ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని… కృష్ణా-గుంటూరు జిల్లాలకు చెందిన వారంతా ఆ ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి దానికి బాధ్యతగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లడమే సమంజసమని పవన్ మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగానే మూడు రాజధానులు విషయంలో జగన్ తన పంతం నెగ్గించుకున్నారు కాబట్టి లీడర్లు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదన్నట్లు పవన్ మాట్లాడితే అధికార పార్టీ నేతలు అసలు అతనిని పట్టించుకోలేదు కానీ బాబు మాత్రం ఏదో పవన్ తన పై తీవ్ర ఆరోపణలు చేసినట్లు 48 గంటల్లో జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాజీనామాలే జరుగుతాయని మాట్లాడినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అసలు రాజీనామా అంశం బాబు పార్టీ అంతర్గత వ్యవహారాల్లో భాగంగా కూడా ప్రస్తావించడం ఎంతవరకు సమంజసం అన్నది వారి మాట..
గోటితో పోయేదానికి గొడ్డలి దాకా
వైసీపీ నేతలు లాగా పవన్ మాటలను పట్టించుకోకపోతే బాబు కి ఏమీ నష్టం ఉండేది కాదు అయితే ఇప్పుడు ఎలాగు జగన్ మొండిగా ఈ విషయంలో ఎలాగూ వెనక్కి తగ్గడు కాబట్టి బాబు మాట ఇచ్చినట్లు రాజీనామాలు చేయవలసి వస్తుంది. అయితే ఇప్పటికే అమరావతి ప్రజలు బాబు పై రగిలిపోయి ఉన్నారు. మళ్లీ అతని ఎమ్మెల్యేలను శాసనసభకు పంపిస్తే తమకు న్యాయం చేకూరుతుందని ఆశ వారికి ఏ కోశానా లేదు. ఇలాంటి సమయంలో బాబు మాట్లాడిన మాటలు సొంత ఎమ్మెల్యేలకే అసహనం వ్యక్తం చేశాయి.
అదే జరిగితే పవన్ సూపర్ హ్యాపీ….
సరే… బాబు ఇక తన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాడు అనే అనుకుందాం. దీనివల్ల పవన్ కు లాభం ఏమిటి…? రాజీనామాల పై ప్రకటన వచ్చిన వెంటనే అమరావతి కి వెళ్ళి ఆ ప్రజలకు భరోసా కల్పించడమే పవన్ ప్రధాన టార్గెట్. ఎలాగా వైసిపి, టిడిపి మీద పీకల దాకా కోపం తో ఉన్న ప్రజలు ఇక ప్రత్యామ్నాయంగా జనసేన-బిజెపి వైపుకే వస్తారు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉంది వారికి చిన్న భరోసా ఇస్తే ఎగబడి మరీ జనసేన-బిజెపి లకు ఓట్లు వేస్తారు అన్నది పవన్ ప్లాన్. అందుకు అతను చేయాల్సిందల్లా అటు అధికార పార్టీ నేతల చేత లేదా ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలను రాజీనామా చేయించడం. ఆ విషయంలో పవన్ సక్సెస్ అయితే అతనికి సగం ఓట్లు పోల్ అయినట్లే.
40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అమరావతి నేతలతో దీక్షలు చేపట్టించడం.. కరోనా నేపథ్యంలో తెలివిగా ఉద్యమాలు చేయించి మరలా వారికి దగ్గర కావడం వంటివి చేయకుండా…. పవన్ ట్రాప్ లో పడడం ఏమిటో టిడిపి వర్గాలకు అర్థం కావడం లేదు. పవన్ ఇలాగే దూసుకుపోతే రాబోయే రోజుల్లో టిడిపి మనుగడ రాష్ట్రంలో కొనసాగడం చాలా కష్టం అవుతుంది.