Actor Siddharth Saina Nehwal: ఇటివల భారత ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో జరిగిన భద్రతా లోపం యావత్ దేశంలో తీవ్ర కలకలం రేపింది. రాజకీయ రంగు పులుముకున్నా ఈ అంశం ఏకంగా భధ్రతాపరమైన అంశాన్ని లేవనెత్తింది. దేశంలోని ఎందరో సెలబ్రిటీలు, రాజకీయవేత్తల నుంచి సామాన్యుల వరకూ భిన్న స్వరాలు వినిపించాయి. ఈక్రమంలోనే భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కూడా స్పందించింది. ‘దేశ ప్రధాని భద్రతకే ముప్పు వాటిల్లితే దేశం సురక్షితంగా ఉందని ఎలా చెప్పుకోగలం’ అని ట్వీట్ చేసింది. దీనిక ప్రతిగా హీరో సిద్ధార్ద్ చేసిన రీట్వీట్ ప్రకంపనలు రేపింది. సిద్ధార్ధ్ పై తీవ్ర విమర్శలు రావడంతో సైనా నెహ్వాల్ కు సారీ చెప్తూ ట్విట్టర్ లో లేఖ విడుదల చేశాడు.
సిద్ధార్ధ్ ట్వీట్ ఇలా..
‘డియర్ సైనా.. కొన్ని రోజుల క్రితం మీ ట్వీట్ కు నేను స్పందించిన విధానంపై నేను క్షమాపణలు చెప్తున్నాను. మీ ట్వీట్ తో నిరాశ, కోపంలో ఆ కామెంట్లు చేశాను. జోక్ చేస్తే దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ.. జోక్ లా భావించినందుకు క్షమాపణ చెప్తున్నాను. మిమ్మల్ని అగౌరవపరచాలనేది నా అభిమతం కాదు. మీరెప్పటికీ మా ఛాంపియనే’ అని వివరణ ఇచ్చాడు (Actor Siddharth Saina Nehwal) సిద్ధార్ధ్. ‘చిన్న కాక్ తో ఆడే ప్రపంచ ఛాంపియన్..! దేవుడికి ధన్యవాదాలు.. భారత్ ను కాపాడేందుకు కొందరు రక్షకులు ఉన్నారు’ అంటూ సిద్ధార్ధ్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ అంశంపై జాతీయ మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్ధార్ధ్ ఖాతాను బ్లాక్ చేయాలని లేఖ కూడా రాసింది.
క్షమించమని ట్వీట్..
అయితే.. దేశ పౌరులుగా ఎవరైనా తమ అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. సెలబ్రిటీగా మరింత హుందాగా, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. కానీ.. సిద్ధార్ధ్ చేసిన ట్వీట్ దేశ ఖ్యాతిని బ్యాడ్మింటన్ తో ప్రపంచానికి చాటిన సైనా వంటి క్రీడాకారిణిని అవమానిస్తూ కామెంట్ చేయడం తగనిది. సైనా నెహ్వాల్ స్పందిస్తూ.. ‘తానేమన్నాడో నాకు తెలీదు. నటుడిగా అభిమానిస్తా. కానీ.. తన భావ వ్యక్తీకరణకు మంచి మాటలు ఉపయోగించాల్సింది’ అని ట్వీట్ చేసింది. భవిష్యత్తులో అయినా ఓ సెలబ్రిటీగా (Actor Siddharth Saina Nehwal) సిద్ధార్ధ్ తాను క్షమాపణ చెప్పే పరిస్థితులకు తన ట్వీట్లు ఉండకూడదని సగటు వ్యక్తి అభిప్రాయం..!