కార్పొరేట్ మూల్యం చెల్లించుకోవాల్సిందే….
తెలంగాణది ఇప్పుడు సంధికాలం. దేశానికే ఆదర్శం అని చెప్పుకునే రాష్ట్రంలో ఇప్పుడో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నా్య్. బ్రాండ్ హైదరాబాద్ పేరుతో తెలంగానం ఆలపించిన సీఎం కేసీఆర్ కరోనా వైపరీత్యాన్ని ఎలా దాటతారన్న ట్విస్ట్ గులాబీ శ్రేణులతోపాటు… తెలంగాణ వాసుల్ని వెంటాడుతోంది.
సారంటే ఒక పవర్. సారంటే అతడే ఒకసైన్యం. అయితే కరోనా కంట్రోల్ విషయంలో కేసీఆర్ చేయాల్సిందంతా చేశారా.. మధ్యలో వదిలేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయ్… కరోనా డీలింగ్ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలిచారని అందరూ అనుకున్నారు.
ఆయన చెప్పిన మాటలు అన్నీ ఇన్నీ కావు. సాక్షాత్తూ తనయుడు, మంత్రి కేటీఆర్ సైతం.. కేసీఆర్ మీడియా సమావేశాల కోసం జనం ఎదురు చూస్తున్నారంటూ చెప్పారు. కరోనా కంట్రోల్ విషయంలో కేసీఆర్ స్టైల్ నిజంగా అందరికీ భిన్నమైనదే. లాక్ డౌన్ గురించి కూడా విస్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. డబ్బులెప్పుడైనా సంపాదించొచ్చు… ప్రాణాలు నిలబెట్టాలన్నారు. ఇంతటి సింపుల్ లాజిక్ అర్థం చేసుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని తెలంగాణ సమాజంతోపాటు, పక్కనే ఉన్న ఆంధ్రా జనం సైతం చప్పట్లు కొట్టారు.
సీన్ కట్ చేస్తే ఇప్పుడు అర్థమవుతోంది. కరోనా డీల్ చేసే విషయంలో కేసీఆర్ అనుకున్నంతగా విజయం సాధించలేకపోతున్నారని… ట్రేసింగ్ సంగతి పక్కనబెడితే వచ్చినవారికి చికిత్స చేసే విషయంలోనూ ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. గాంధీ ఆసుపత్రిలో అన్ని ఖాళీలున్నాయ్.. ఇన్ని ఉన్నాయంటూ లెక్కలు ప్రభుత్వం బాగానే చెబుతున్నా… జనం మాత్రం బెదిరిపోతూనే ఉన్నారు. ఎందుకంటే గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేసుకుంటూ మృతి చెందిన ఒకరిద్దరు గురించి వస్తున్న వీడియోలతో జనం బెంబెలేత్తిపోతున్నారు. ఇక్కడ గాంధీ ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిని ఎవరైనా ఒక్క మాట అన్నా అది పాపం. కష్టం కాలంలో పేదలకు, బడుగులకు వారు చేస్తున్న సేవ అనన్యసామాన్యమైనది. లేకుంటే ఈ జనమంతా కరోనా పేరు వినే గుండెపగిలే చచ్చేవారు.
కరోనాకు ట్రీట్మెంట్ విషయంలో నేరుగా ఒక మంత్రికి ఒక శాఖ కేటాయించి ఎందుకు పర్యవేక్షించరు కేసీఆర్ అన్న అభిప్రాయం సాధారణ జనాల్లో కలుగుతోంది. ఏదైనా సీరియస్ గా తీసుకుంటే కచ్చితంగా దాన్ని తేల్చే వరకు విడిపెచ్చని సీఎం సారూ కరోనా విషయంలో ఎందుకని అంతగా చూడటం లేదన్న అభిప్రాయం జనంలో ఉంది. అంతెందుకు ఇప్పుడు తెలంగాణలో కరోనా సర్వే చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందన్నదానిపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. కరోనా డీల్ చేసే విషయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే ఆయనకు ఎంతో పేరు వచ్చేది. కార్పొరేట్ కట్టడికి చర్యలు తీసుకుంటే ఆయన ఖ్యాతి మరో మైలు రాయి చేరేది. హైదరాబాద్ బ్రాండ్ ఎస్టాబ్లిష్మెంట్ బాధ్యత తనయుడికి అప్పగించినట్టుగా కరోనా కట్టడికి ఒక మంత్రికి అప్పగించి ఉంటే ఎంతో బావుండేది.
ఎందుకని జనం గోస కేసీఆర్ సారుకు పట్టదా…
ఎందుకంటే కార్పొరేట్ దాష్టీకాలు అన్నీ ఇన్నీ కావు. లక్షలకు లక్షలు బిల్లులు వేస్తూ దొచేసుకుంటున్నారు. అడ్డూ అదుపూ లేకుండా వందల కోట్లను కాజేస్తున్నారు. కేంద్రానికి అసలే పట్టదు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హైకోర్టు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తోంది. కడుపుకు తినేది అన్నమే కదా… కరోనాతో జనం చేస్తుంటే కాసుల వేటతో నింపుకోవాలని చూస్తున్నారా… తక్షణమే ఐటీ శాఖ హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో పహారా పెట్టాలి. ఎంత వసూలు చేస్తున్నారో లెక్కలు తీయాలి. ఒక్కొక్క ఆసుపత్రి తాట తీయాలి. కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఆసుపత్రుల యాజమాన్యాలను నడిరోడ్డున పెట్టి కరోనా వ్యాధిని అంటింపజేయాలి.
అతి అనర్థం కదా… లక్షల్లో ఫీజులు. పైపెచ్చు రికమండేషన్లు. ఇదేం చోద్యం… దొంగనాయాళ్లు…వీళ్లను ఎన్ని తిట్టినా చాలదు. ప్రభుత్వం చెప్పిన ఫీజులు వీళ్లు వసూలు చేయరు. రోగి ప్రాణం విలువ వీరికి కాసుల గలగలతో చూసుకుంటున్నారు.
అసలు విషయానికి వద్దాం… కరోనాతో ట్రీట్మెంట్ పేరుతో లక్షలు గుంజుతున్న ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను ఒక్కదాన్ని సీజ్ చేస్తే పరిస్థితి అదుపులోకి రాదా… ఎందుకు ప్రభుత్వం చేయడం లేదు. ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా కరోనా అన్న భయం జనాలను వెంటాడుతోంది. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కారు కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చింది. లక్షల్లో టెస్టింగులు చేస్తోంది. ఇంటింటికీ వెళ్తామంటోంది. మరి ఇంత ధనిక రాష్ట్రం ఆ పని చేయలేదా… ఎందుకు జనాలను హింసిస్తారు… అంటే కార్పొరేట్ కోట్లు దండుకునే పథకాన్ని ఎందుకు అదుపు చేయరు. ప్రకృతి ప్రకోపిస్తే కరోనా వచ్చిందని సనానతనవాదులు చెబుతున్నారు. వీరు చేసే చేష్టలకు ప్రకృతి కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. కార్పొరేట్లారా… మీకు తగిన శాస్తి దేవుడు చేసి పెడతాడు… తస్మాత్ జాగ్రత్త.