కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇంట్లో సిబిఐ సోదాలు నిర్వహిస్తుంది..!
ఏపీ రాజకీయానికి ఏమి సంబంధం లేదు..!
జగన్ కి మోడీ అపాయింట్మెంట్ ఇచ్చారు. రేపు ఉదయాన్నే వీరి భేటీ జరగనుంది.
కర్ణాటక రాజకీయానికి ఏమి సంబంధం లేదు…!
కానీ ఈ రెండిటి ఉమ్మడి బాధ్యులు బీజేపీ. బాధితులు విపక్షాలు. అక్కడితో ఆగలేదు. ఈ రెండిటికి మధ్య చంద్రబాబు అనే ఓ లింకు ఉంది..!! కర్ణాటకలో కాంగ్రెస్ నేత ఇంట్లో సోదాలకీ.., జగన్ ఢిల్లీ వెళ్లి మోడీని కలవడానికి.., ఇక్కడ చంద్రబాబుకి లింకు ఉంది అనడానికి చిన్నపాటి లాజిక్కులు మాత్రం ఉన్నాయి. వాటికి ఛేదిస్తూ వస్తే.., ఈ లింకు బీజేపీ సీరియస్ గా తీసుకుంటే చంద్రబాబుకి మూడింది అని ఫిక్సయిపోవచ్చు..! ఈ అంశంపై కొంచెం లోపాలకి వెళదాం..!!
జగన్ కలయిక ఒకే అయితే..!
జగన్ రెండు వారాల వ్యవధిలో ఢిల్లీ వెళ్తున్నారు. మొన్నటిసారి వెళ్ళినప్పుడు బీజేపీ ద్వయంలో ఒకరైన అమిత్ షాని కలిశారు. ఇప్పుడు ఆ ద్వయంలో రెండో వ్యక్తి మోడీని కలుస్తున్నారు. ఒకరకంగా దేశమే వీరిద్దరి గుప్పిట్లో ఉంది. జగన్ కి రెండు సార్లు వీళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు అంటే అదేదో పెద్ద విషయమే అయి ఉంటుంది.
సింపుల్ గా చెప్పుకోవాలి అంటే ఎన్డీఏలో జగన్ చేరిక గురించో.., న్యాయవ్యవస్థ గురించో అయి ఉంటుంది. మొదటిది మాత్రం పక్కా అనే సమాచారం అందుతుంది. ఒక వేళ జగన్ ఎన్డీఏలో చేరితే ఇక్కడ బాబుకి మూడినట్టే కదా..! “ఏమయ్యా జగనూ..! వచ్చే ఎన్నికల నాటికి నువ్వు, నేను చూసుకుందాం. ఆ బాబుని పక్కకు తోసెయ్. ఎమ్మెల్యేలను లాగేసి, కేసులు పెట్టేసి, చిందరవందర చేసేయ్..! నీకు ఫుల్ పవర్స్..!” అని పెద్దలు అంటే జగన్ కి కొమ్ములు వాడెక్కినట్టే కదా..! చంద్రబాబు/ టీడీపీ మూలకు చేరితే జగన్ కి బీజేపీ పెద్ద లెక్కేమ్ కాదు. అందుకే జగన్ టీడీపీ పతనం కోసం, తన కేసుల కోసం, తన ఇతర అవసరాల కోసం… బీజేపీ అడిగితే మాత్రం ఎన్డీఏలోకి చేరడం ఖాయమే.
కాంగ్రెస్ ఆర్ధిక మూలాలు @ శివ కుమార్..!!
డీకే శివకుమార్ పై అవినీతి కేసులున్నాయి. సీబీఐ దాడులు ఇప్పుడే కొత్త కాదు. ఒకరకంగా కాంగ్రెస్ కి ఆ రాష్ట్రంలో ఆర్ధిక మూలాలు శివ కుమార్ మాత్రమే. అసలే అక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయి. అందుకే శివ కుమార్ ని మళ్ళీ సీబీఐ టార్గెట్ చేస్తుంది అంటూ సాక్షాతూ ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేసారు. అంచేత ఆర్ధిక మూలాలు పెకలించేపనిలో బీజేపీ ఉందన్నమాట. అదే జరిగితే గత ఏడాది ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఆర్ధిక దన్నుగా నిలిచాడని జాతీయ స్థాయిలో పేరొందిన చంద్రబాబు సంగతి ఏమవ్వాలి..? నిజమే కదా..!
రెండు పగలు కలిస్తే బాబు ఆర్ధికంగా మటాష్..!!
జగన్ సర్వేంద్రియాలు ప్రస్తుతం టీడీపీ పతనం కోసమే పని చేస్తున్నాయి. సంక్షేమం అమలు చేయడం ఒక ఎత్తు.., తన రాజకీయంగా పోటీ లేకుండా చేసుకోవడం మరో ఎత్తు. ప్రస్తుతం జగన్ ఇవే అమలు చేస్తున్నారు. దీనిలో భాగంగా చంద్రబాబు ఆర్ధిక మూలాలు పూర్తిగా పెకిలించాలి అంటే తన లాగానే సిబిఐ కేసులు పడాల్సిందే. ఈడీ రంగంలోకి దిగాల్సిందే. 1996 లో సీఎం అయినప్పటి నుండి అన్నీ తీగలు లాగేసి, బాబు బండారం తేలిపోవాల్సిందే. కేసులు కట్టేసి, ఆస్తులు లాగేసి, జప్తులు చేసేస్తే బాబుకి మూడుతుంది, లోకేష్ కి కోరలు పీకేసినట్టు ఉంటుంది. అప్పుడు వచ్చే ఎన్నికల నాటికి బాబు / టీడీపీ నీరసిస్తుంది. ఇది జగన్ లక్ష్యం. జగన్ తో అధికారికంగా కలిసాక.., ఇక బీజేపీ లక్ష్యం కూడా ఇదే అయినా ఆశ్చర్యం అవసరం లేదు. మోడీకి అన్నీ గుర్తుంటాయి. 2019 జనవరి నుండి ఏప్రిల్ మధ్యలో చంద్రబాబు ఆడిన ప్రతీ మాట మోడీ మైండ్ లో ఉంటుంది. వాటి పర్యావసానాలు బాబుకు తెలియాలన్నది మోడీకి ఉంటుంది కదా..!!