ఇళ్ల స్థలాల పంపిణీ సుప్రీం కోర్టు తీర్పు
ఇళ్ల స్థలాల పంపిణీ పైన సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమరావతి మాస్లర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ ఆర్ జోన్ -5 పైన ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.. దీన పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. హైకోర్టులో విచారణ జరిగిన తీరును సప్రీం సమర్ధించింది. దీని పైన విచారణ చేసిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీని పైన తుది విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని హై కోర్టుకు సూచించారు. మాస్టర్ ప్లాన్ లో మార్పు చేస్తూ రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీని పైన హై కోర్టు లో దాఖలైన పిటీషన్ పైన విచారణ సమయంలో స్థానికుల ఆమోదం లేకుండా నిర్ణయం సరికాదని వాదించారు. సీఆర్డీఏ సెక్షన్ 41 మేరకు మాస్లర్ ప్లాన్ లో ఎప్పుడైనా మార్పులు చేయలంటే గ్రామ కమిటీల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేసారు. దీంతో..అప్పట్లో హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సస్పెండ్ చేసింది.
హైకోర్టుకు సమర్థన
హైకోర్టులో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సస్పెండ్ చేయటంతో దీని పైన సుప్రీంలో ఏపీ ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లింది. కాగా, కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న కారణంగా ఇప్పటి వరకు ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పలుమార్లు వాయిదా పడింది. ఇప్పుడు సుప్రీంలో ప్రధాన న్యాయమూర్తి విచారించి..ఈ మేరకు హైకోర్టును ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకూ ప్రభుత్వ జీవోలు సస్పెన్షన్ లో ఉంటాయనే గతంలో హైకోర్టు తీర్పును ఇప్పుడు సుప్రీం సమర్ధించింది. దీంతో..హైకోర్టు విచారణను సమర్ధించిన సుప్రీం..తుది విచారణ ముగించాలని ఆదేశించింది. ఇక, తిరిగి ఇప్పుడు ఈ కేసు విచారణ ఏపీ హైకోర్టులోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంత..ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో తాజా పరిణామాలతో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.