TDP : వైఎస్ఆర్సిపి దెబ్బకు తెలుగుదేశం పార్టీ పూర్తిగా కుదేలయింది. మున్సిపల్ ఎన్నికల్లో జగన్ రాష్ట్రంపై తనకు ఏ మాత్రం పట్టు తగ్గలేదని మరోసారి నిరూపించారు. లీడర్లు వస్తుంటారు… పోతుంటారు కానీ క్యాడర్ మాత్రం తమతోనే ఉందని చంద్రబాబు ఎప్పుడూ చెబుతుంటారు. అసలు అలాంటి క్యాడర్ ఇప్పుడు అసలు తెదేపాకి ఉందా….? అనే అనుమానాలు అందరికీ మొదలైపోయాయి.
TDP : నిజంగా వండర్..!
అసలు ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చిందం…టే భవిష్యత్తులో టిడిపి నిలబడాలి అంటే వారికి ఏదో ఒక చోట నుండి ఇన్స్పిరేషన్ అనేది కావాలి. 75 మున్సిపాలిటీల్లో 74 చోట్ల వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. 99% మున్సిపాలిటీల్లో అయితే టిడిపి సగం వార్డులను కూడా గెలుచుకోలేని పరిస్థితి. 11 కార్పొరేషన్లలో వంద శాతం వైసీపీవే. చివరికి మైదుకూరులో గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆ మున్సిపాలిటీ కూడా అధికార పార్టీ ఖాతాలోనే పడిపోయింది. ఇలాంటి ఒక ప్రపంచంలో టిడిపికి అసలు ఛాన్స్ ఎక్కడ ఉంది అనుకుంటున్న సమయంలో… ఒకే ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆ పార్టీ నేతలను సైతం ఇది ఆశ్చర్యంలోకి నెట్టేసిన పరిణామం. చంద్రబాబు కూడా కొద్దిగా ఆశ్చర్యపోయి ఉండొచ్చు.
ఎంతైనా వారికి విషయం ఉంది….!
సో…. ఇప్పుడు తాడిపత్రి లో విజయాన్ని కేస్ స్టడీ గా తీసుకుంటే అక్కడ జేసీ బ్రదర్స్కు మొత్తం క్రెడిట్ ఇచ్చేయాలి. ఇది తెలుగుదేశం పార్టీ విజయం కన్నా కూడా వారి వ్యక్తిగత విషయం అని చెప్పాలి. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఒక మామూలు కౌన్సిలర్ గా పోటీ చేశారు. మొదట కౌన్సిలర్ గానే తన రాజకీయ జీవితం ప్రారంభించి ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా కూడా పని చేశారు. తాడిపత్రిలో వారిపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులను దగ్గరుండి చేయిస్తున్నారు అని అప్పటినుండే జేసీ బ్రదర్స్ కు మంచి పేరు ఉండేది. క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలను తలపెడుతూ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేశారని అంటారు. మొత్తానికి ఈ మధ్య జరిగిన పరిణామాలను కూడా చూసుకుని చరిత్రను వదిలేసి మద్దతుదారులు, పార్టీ కేడర్ తాడిపత్రిలో మిగతా ప్రపంచంతో మాకు సంబంధం లేదు అన్నట్లు టీడిపి కోసం విస్తృతంగా కృషి చేశారు. దాని ఫలితంగానే 36 వార్డుల మున్సిపాలిటీ లో 18 వార్డుల్లో టిడిపి లేదా జేసి వర్గం గెలుపొందింది.
కాబట్టి అసలు తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ కి ఉన్నది ఏమిటి…. మిగిలిన చోట్ల టిడిపి ప్రధాన నేతల్లో లోపించినది ఏమిటి అని చంద్రబాబు ఇప్పటికైనా స్టడీ చేస్తారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో టీడీపీ కేడర్, నాయకులు బలపడకపోతే శాశ్వతంగా పార్టీని భూస్థాపితం చేసేందుకు వైసిపి కాచుకుని ఉంది. మరీ దీని నుండి చంద్రబాబు తప్పించుకుంటారో లేదో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?